కిడ్నీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఏ.కొండూరు కిడ్నీ బాధితులందరికి ఆర్థికసహయం, ఆయా కార్పొరేషన్ల నుండి ఋణాలు, తిరువూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం, అన్ని గ్రామాలకు పైపులైన్ ద్వారా కృష్ణ జలాల సరఫరా, పెన్షన్లు, డయాలసిస్ చేయించుకునే వారికి అంబులెన్స్, ఉచితంగా మందుల సరఫరా, చనిపోయిన కిడ్నీ బాధిత కుటుంబాలకు ప్రకటించిన 5 లక్షల ఎక్స్ గ్రెసియా వెంటనే ఇవ్వాలి.భావితరాలకు కిడ్నీ సమస్య రాకుండా చౌక డిపోల ద్వారా పౌష్టికాహారం అందించాలి వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ch. బాబురావు గారు,సిపిఎం పశ్చిమ కృష్ణ కార్యదర్శి d.v కృష్ణ గారు,జిల్లా కమిటీ సభ్యులు g. విజయప్రకాశ్ గారు అధికారులకు వినతిపత్రం అందించారు.