హెచ్.ఎం.టి.వి. న్యూస్ ఛానల్ పై భజరంగ్దళ్ దాడి
Date:
December 12, 2010
హెచ్.ఎం.టి.వి. న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై భజరంగ్దళ్ కార్యకర్తల దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఖండిస్తున్నది.
న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన కథనాలపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆఫీస్ పై దాడికి పూనుకోవడం గర్హనీయం. పత్రికా స్వేచ్ఛకు భంగం కల్గించే విధంగా మతత్వవాదులు దాడులకు పూనుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

