పార్టీ కార్యక్రమాలు

Wed, 2016-02-10 19:34

పాల‌కులు అన్ని వైపుల నుండి ప్రజల‌పైన ముప్పేట దాడి చేస్తున్న నేటి తరుణంలో ప్రజల‌ను కదిలించి పోరాటాలు చేయడం ద్వారానే వాటిని ఎదుర్కొనగల‌మని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు అన్నారు. ఈ రోజు ఉదయం పాల‌ఫ్యాక్టరీ వద్ద గల‌ ఆఫీసులో కార్మికనేత సిపిఎం సీనియర్‌ నాయకు కామ్రేడ్‌ పి. దివాకర్‌ గారి 12వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ రైతు నుండి బవంతంగా భూము గుంజుకుంటున్నారు. కార్మిక హక్కును కారాస్తున్నారు.  పట్టణాల్లో ప్రజపై భారాలు పెంచుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజు సంఘటితం కాకుండా చీల్చ‌డానికి కుంపట్లు రగిలిస్తున్నారు.  ఇలాంటి పాల‌కులు ప్రజపై చేస్తున్న దాడుల‌ను ఎదుర్కొల‌నాంటే ప్రజను సమీకరించి పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. గతంలో ఇటువంటి...

Tue, 2016-02-09 17:03

మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి 2 సం||రాలు కావస్తున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు. వర్షాభావంతో రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పేరుకు పొయాయని, వాటిని తక్షణమే పరిక్షరించాలని కోరారు.

Mon, 2016-02-08 19:19

  అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన  రైతు

    కృష్ణాజిల్లాలోని గ్రామాల‌ను గ్రీన్‌జోన్‌ నుంచి మినహాయించేందుకు అఖిపక్ష నేతలు ఈ నె 29వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. ఆలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయకపోతే విజయవాడలో సిఎం క్యాంప్‌ కార్యాయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జల‌వనరుశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతు పక్షాన నిబల‌డతారో, సింగపూర్‌ కంపెనీల‌కు వత్తాసుగా ఉంటారో స్పష్టం చేయాల‌ని డిమాండు చేశారు. కృష్ణాజిల్లా మైవరం, జి కొండూరు మండలాను గ్రీన్‌జోన్‌ నుంచి తొల‌గించాంటూ రైతు రాజధాని ప్రాంత ప్రాధికారసంస్థ (సిఆర్‌డిఎ) కార్యాయాన్ని సోమవారం ముట్టడిరచారు. గ్రీన్‌జోన్‌లో చేర్చటంపై అభ్యంతరాలు...

Fri, 2016-02-05 20:15

విజ‌య‌వాడ రాజీవ్‌గాంధీ కాల‌నీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు అయియినా  అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సి.పి.ఎం. రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు శ్రీ సిహెచ్‌.బాబూరావు మండిప‌డ్డారు.  వారికి శాశ్వ‌త గౄహాలు మంజూరు చేయాల‌ని కోరారు.  
 గూడుపోయింది, నోటికాడ కూడు పోయింద‌ని బాధితుల వెల్ల‌డి.  ఘోర అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి అటు చలిలో, ఇటు ఎండల్లో తీవ్ర ఇబ్బందు పడుతూ దుర్బరంగా తయారయిన రాజీవ్‌గాంధీకానీ వాసును సిపిఎం నాయకు బృందంగా వెళ్లి పరామర్శించారు. కానీ మొత్తం ప్రతి ఇంటింటికీ తిరిగి, బాధిత ప్రజను పరామర్శిస్తూ, ప్లిు, వృద్దు, మహిళ యోగక్షేమాను అడుగుతూ, భోజనాు, ఇతర ఏర్పాట్ల పరిస్థితిపై బాబూరావు, కాశీనాథ్‌ అడిగి తొసుకుంటూ కానీ మొత్తం...

Fri, 2016-02-05 11:06

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలా? వద్దా? అనే విషయమై దమ్ముం టే చంద్రబాబునాయుడు 'ప్రజాభిప్రాయ ఓటింగు' పెట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సవాల్‌ విసిరారు. 'మెజార్టీ ప్రజలు ఎయిర్‌పోర్టు కావాలంటే కట్టుకోండి. లేదంటే తోకము డిచి ఎయిర్‌పోర్టు ప్రతిపాదన విరమించు కోండి' అని సూచించారు. రాష్ట్ర రాజధానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సరిపోయినప్పుడు, విశాఖలో ఎయిర్‌పోర్టు ఉండగా ఇక్కడ మరొకటి ఎందుకని ప్రశ్నించారు. ఇది భోగాపురంలోని పెద్దల భూములకు ధరలు పెరగడానికి తప్ప, ప్రయాణికుల కోసమో, ప్రజల కోసమో కాదని విమర్శించారు. అభివృద్దే అనుకుంటే.. ఈ ప్రాంతంలోని మంత్రి అయ్యన్నపాత్రుడు భూములు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు....

Tue, 2016-02-02 12:06

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యాన ముంపు గ్రామాల్లో జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. 18 ఏళ్ళల నిండిన నిర్వాసిత యువతీ యువకులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే రూ.5లక్షలు అదనంగా చెల్లించాలన్నారు.

Sat, 2016-01-30 19:09

మున్సిపల్‌ కార్మికుల పొట్టగొట్టే 279 జీవోను రద్దుచేయాలని కోరుతూ కనిగిరి నగర పంచాయతీ కార్మికులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కనిగిరి డివిజన్‌ కార్యదర్శి పీసీ కేశవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఉద్యోలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్‌, ఉపాధి హామి సిబ్బంది తొలగించారని, ఆరోగ్య మిత్ర, అంగన్‌వాడీల మెడమీద కత్తిపెట్టారని ఆన్నారు. మున్సిపల్‌ కార్మికుల తొలగింపునకు జీవో జారిచేయటం దారుణమన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల తొలగింపు చర్యలు మానుకోవాలని లేకుంటే పోరాటాలు తీవ్రతరం...

Tue, 2016-01-26 12:54

సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ సమూ లంగా మార్చాలని, వ్యవ సాయ పరిరక్షణ జోన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని CRDA కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. మాస్టర్‌ప్లాన్‌ నమూనాలను రైతులు, నాయకులు దహనం చేశారు. వ్యవసాయ జోన్ల పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు సిఆర్‌డిఎ ఉరి తాడు బిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్‌డిఎ చైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. పారిశ్రామిక వేత్తలు, అధికార పార్టీ నాయకులతో సహా అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో మాస్టర్‌ప్లాన్‌ తిరస్కరిస్తున్నారని, స్వదేశీ నిపుణులతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని డిమాండ్‌ చేశారు. మాస్టర్‌ప్లాన్‌ అభ్యంరాలను సింగపూర్‌ సుర్బాన కంపెనీకి నివేదిక అందించామని మంత్రి నారాయణ చెప్పడం సిగ్గుచేటని...

Fri, 2016-01-22 11:42

రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సిపిఎం అధ్వర్యంలో విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కర్నూలులో కూడా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. రోహిత్‌ కుటుంబానికి 5కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్ష చూపడంవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన మండిపడ్డారు. రోహిత్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tue, 2016-01-12 12:55

గ్రామాల్లోకి సర్వేయర్లను రానీయకుండా అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపిచ్చారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురం వద్ద బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ నిమ్జ్‌ రైతులు, కూలీల సదస్సు సోమవారం జరిగింది. సయ్యద్‌ హానీఫ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మధు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. '2013 జిఒ ప్రకారం భూమిని తీసుకోవాలంటే నష్ట పరిహారం చెల్లించి సర్వే చేయాలి. గ్రామ సభలు పెట్టాలి. 80 శాతం మంది మెజారిటి ఆమోదం పొందాలి. ఆ తరువాత పనులు చేపట్టాలి. అందుకు భిన్నంగా ఎనిమిది మందితో మాత్రమే ఆమోదించి భూమి లాగేసుకున్నారు. ఇది...

Wed, 2016-01-06 17:24

సీమ అభివృద్ధిలో భాగంగా ఉద్యమాలకు సీపీఎం శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాయలసీలమ అభివృద్ధి నినాదంతో వచ్చే నెలలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫ్రిబవరి రెండో వారంలో రాయలసీమ జిల్లాల నుండి బస్సు, పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, రాయలసీమలోని సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక రాయలసీమ అన్నది వ్యర్థమైన డిమాండ్ అని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాయలసీమకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిటిడి నిధులను రాయలసీమ జిల్లాల నీటి సదుపాయానికి వినియోగించాలని, జన్మభూమి పేరిట జరుగుతున్నది ప్రచార...

Pages