కేంద్రంలోని మతోన్మాద బిజెపి అండతోనే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అరాచక పాలన సాగిస్తున్నారని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలపై అక్కడి పాలక తృణమూల్ కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న దాడిని నిరసిస్తూ బీసెంట్ రోడ్డులోని మహంతి మార్కెట్ సెంటర్లో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నేతృత్వం వహించింది. తొలుత సిపిఎం కార్యాలయమైన సుందరయ్య భవన్ నుండి ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీకి చెందిన పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో మధు మాట్లాడుతూ.. అనేక...
పార్టీ కార్యక్రమాలు
రాజధాని నిర్మాణ విషయంలో రహస్య ఒప్పందాలవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సిపిఎం సిఆర్డిఏ ఏరియా కన్వీనర్ సిహెచ్.బాబూరావు విమర్శించారు. రాజధాని విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అనుమానాలకు ఊతమిస్తున్నాయన్నారు. దీనిపై స్పష్టత కరువైందని తెలిపారు. పరోక్ష పద్ధతిలో భూములను విదేశీ కంపెనీలకు కట్ట బెట్టాలనే కుట్ర సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. మాస్టర్ డెవలపర్ ఎంపిక అనంతరం నిర్మాణ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పిన ప్రభుత్వం నేరుగా సింగపూర్ ప్రభుత్వంతో ఎలా చర్చలు జరుపుతుందని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాలను భాగస్వామ్య పద్ధతిలో...
రాజధాని శంకుస్థాపన కోసం రూ. 50 కోట్లు ఖర్చుచేస్తున్న ముఖ్యమంత్రికి అసైన్డ్, సీలింగ్ భూముల సాగుదారుల ఆకలికేకలు వినిపించడం లేదా అని సిపిఎం క్రిడా కన్వీనర్ సిహెచ్.బాబురావు ప్రశ్నించారు. బాధితులకు కౌలుచెక్కుల చెల్లింపుపై ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తుళ్ళూరు క్రిడా కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో అసైన్డ్, సీలింగ్ సాగుదారుల దీక్షలను ఆయన సోమవారం ప్రారంభించారు. రాజధాని ప్రాంత పేదల సమస్యలు పరిష్కరించకుండా తీవ్రమైన అణచివేతకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ నుండి ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వకుండా విచారణ పేరుతో లబ్ధిదారులను కుదించడం అన్యాయమన్నారు.
చింతూరు మండలంలో సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వైద్యశిబిరంలో ఆదివారం 35 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురిని మలేరియా బాధితులుగా గుర్తించారు. ఆదివారం వివిధ గ్రామాలకు చెందిన 100 మంది వైద్యశిబిరానికి వచ్చారు. వారిలో ఐదుగురు మలేరియా బాధితులు ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు తెలిపారు.రోజురోజుకూ వైద్యశిబిరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని, వారందరికీ తగిన వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.
రాజధాని నిర్మాణానికి రూపొందించామంటున్న మాస్టర్ప్లానంతా బూటకమని సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్ సిహెచ్. బాబూరావు విమర్శించారు.విజయవాడ ప్రాంతంలోనే రాజధానంటే అంతా ఆనందపడ్డారని, కానీ ప్రభుత్వ విధానాలను చూసి రాజధాని ఇక్కడెందుకంటూ ప్రజలు మనోవేదన చెందుతున్నారని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డిఎ పరిధిలోని 59 మండలాల భూముల్ని అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్గా ప్రకటించి, రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోం దన్నారు. గ్రీన్ బెల్డ్గా పేర్కొంటున్న ఈ ప్రాంతంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికిగాని, ప్లాట్లు కొనుగోలు చేసుకోవడం గాని కుదరదన్నారు. సిఆర్డిఏ పరిధిలోని 16 లక్షల ఎకరాలల్లో 2050 వరకు ఇళ్ల...
ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మొండివైఖరిని కొనసాగిస్తే... ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని వామపక్షాలు హెచ్చరించాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలోని బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ ప్రకటించిన గ్రామాలైన మంగినపూడి, బుద్దాలపాలెం, గుండుపాలెంలో గురువారం సభలు నిర్వహించగా అందులో తొమ్మిది వామపక్ష అగ్రనేతలు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, భూ బ్యాంక్ పేరుతో ప్రతి జిల్లాలోనూ లక్షలాది ఎకరాలు సేకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగు లేస్తుండడంతో బాధితులందరినీ కూడగట్టడానికి వామ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. మంగినపూడిలో కొందరు భూస్వాములను...
ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ఉద్యమించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కూడా దోహదం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ లెనిన్ సెంటరు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్, పూర్తి స్థాయిలో పరిశ్రమలు, విద్యా సంస్థలు రాలేదన్నారు.
కార్పొరేట్ల అనుకూల విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా తరగతుల ప్రజలు విశాల ఉద్యమం చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. పార్టీ ఒంగోలు జిల్లా కమిటీ సమావేశం మంగళవారం సుందరయ్య భవన్లో జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వై వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల అనుకూల విధానాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం గతం కంటే మరింతగా కార్పొ రేట్ల ప్రయోజనాలు కోసం పని చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పేరు చెప్పి బహుళజాతి కంపెనీలకు, పెద్దపెద్ద...
రాజధాని ప్రాంతలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఎం సిఆర్డిఎ కన్వీనర్ సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని సిఆర్డిఎ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు శనివారం ధర్నా చేశారు. కార్యక్రమానికి సిపిఎం రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ పేదలకు పింఛన్లే ఇవ్వలేనివారు రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి రూ.10కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం పేదలకు పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శించారు. తన సొంత ఇల్లు చూసుకున్న సిఎం పేదల ఇళ్ల గురించి మర్చిపోవడం దారుణమన్నారు. దళితుల నుండి తీసుకున్న భూములకు ఇంకా కౌలు చెక్కులు ఇవ్వలేదని, ఈ...
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ప్రపంచబ్యాంకు పాలన మొదలైందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. 76,4260 ఎకరాలను కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్దమైందని ఆయన ఆరోపించారు. కార్మికసంక్షేమం పక్కన పెట్టడం వల్లనే ప్రపంచ బ్యాంకు పెట్టుబడి అనుకూలత రాష్ట్రముగా రెండం స్థానం ఏపీకి వచ్చిందని తెలిపారు. సర్కారు బలవంతపు భూసేరణ పై త్వరలో భారీ ఉద్యమం నిర్మించి రాష్ట్ర బంద్ కు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని మధు తెలిపారు. గతంలో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యుటివ్ గా పేరు తెచ్చుకున్న బాబు మరో ప్రపంచ బ్యాంకు విధానాలను అమలుపరస్తున్నారని మధు దుయ్యబట్టారు.
భోగాపురం ఎయిర్పోర్టుకు ఒక్క ఎకరా కూడా గుంజుకో నివ్వబోమని, అడ్డగోలు భూ సేకరణను కలిసికట్టుగా అడ్డుకుందామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. బలవంతపు భూ సేకరణపై రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పేదోళ్ల భూములే దొరికాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో 13జిల్లాల్లోనూ చంద్రబాబు 15లక్షల ఎకరాలు భూసేకరణ చేపడుతున్నాడని, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు అవేదన చెందుతున్నారని తెలిపారు. అవసరాలకు మించి భూములు గుంజుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ఉద్యమం జరగబోతుందని, దీనికి అందరూ సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు....
అభివృద్ధికి పేదల గుడిసెలు అడ్డంకి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు అన్నారు. భవానీపురం కరకట్ట సౌత్ ప్రాంతమైన భవానీఘాట్ నుండి పున్నమి హాోటల్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ కరకట్ట వాసులు వారం రోజుల్లోగా ఇళ్లను ఖాళీచేసి జెఎన్యుఆర్ఎం ఇళ్లకు తరలివెళ్లాలని నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీచేయటం సిగ్గుచేటన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నగరానికి దగ్గరగా వుండి ఏదోఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని ఏక్కడో దూరంగా పడేస్తే వారి జీవన భృతి కష్టతరంగా మారుతుందన్నారు. ఎన్టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా...