ఏపీలో ప్రజాసాధికార సర్వే..

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజాసాధికార సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.దాదాపు 30వేల మందితో ఆరు వారాలపాటు సర్వే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సర్వే ద్వారా పౌరులకు సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న సమాచారాన్నంతా ఒక చోటకి తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరికి సంబంధించిన కుల, మత, ప్రాంత, సామాజిక, ఆర్థిక పరమైన అంశాలు సర్కారు వద్ద సమగ్రంగా నమోదు కానున్నాయి.