ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్ రిఫరెండంలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడిన నేపథ్యంలో కేజ్రీవాల్... ఢిల్లీకి ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించారు. ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదాపై ప్రజల మనోభిష్టాన్ని తెలుసుకునేందుకు అలాంటి రెఫరెండంను దేశ రాజధానిలో నిర్వహించాలని కేజ్రీ భావిస్తున్నారు.