ప్రభుత్వ తీరే కారణం:మధు

కాపు గర్జన సభ సందర్భంగా జరిగిన ఘటనలు దురదృష్ట కరం, ప్రజలు భద్రత కోరుకుంటారు, రైలు బోగీలు తగలబడడాన్ని ఎవరూ హర్షించరని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఒక తరగతి ప్రజల్లో ఆశలు రేపడం, దీర్ఘకాలం నాన్చడమే ఈ పరిస్థితి రావడానికి కారణమన్నారు. వాగ్దానాలు అమలు పరచాలని ప్రజలు కోరిన నేపథ్యంలో వారితో సంప్రదింపులు జరిపి పరిస్థితి చేజారిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. అయితే, అది ఆ పనిచేయకపోడం వల్లే ఇటువంటి ఘటనలకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు.