బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు విడతలుగా భేటీ అయ్యారు. కోర్ కమిటీ భేటీ తర్వాత అమిత్ షా తన ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. సమావేశం తర్వాత ఓ సీనియర్ నేత అసంతృప్తితో వెళ్లిపోయారని సమాచారం. ఈ కీలక సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ ను పార్టీ హైకమాండ్ ఆహ్వానించకుండా దూరంగా ఉంచింది.