
శారదా కుంభకోణంపై సీబీఐ విచారణ, ఖాగ్రఘర్(బుర్ద్వాన్) పేలుళ్లపై ఎన్ఐఏ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడంలేదంటూ ప్రధాని మోడీని సీపీఐ(ఎం) నేత సూర్యకాంత మిశ్రా ప్రశ్నించారు. నారదా ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని మిశ్రా విమర్శించారు. వారిపై రాజ్యసభ ఎథిక్స్ కమిటీ విచారణ జరపకుండా ప్రధాని అడ్డుపడుతున్నారని మిశ్రా అన్నారు. తృణమూల్ నేతల అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో బెంగాల్ ప్రజలకు స్పష్టం చేయాలని మిశ్రా డిమాండ్ చేశారు.