
బీహార్ ముఖ్యమత్రి నితీశ్ కుమార్ కుమార్ బీజేపీపై మండిపడ్డారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు రామాలయం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇందుకు సంబంధించి కోర్టు విచారణ తేదీలు కూడా వారికి గుర్తుండవు' అని నితీశ్ విమర్శించారు. రెండు వర్గాల మధ్య సమగ్ర చర్చలు జరిగినప్పుడు మాత్రమే అయోధ్యలో రామాలయ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.