
రాష్ట్రం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతూనేఉన్నాయి.. తొలి ఆర్థిక సంవత్సరంలో ప్రధాన శాఖలన్నీ 90శాతం ఆదాయాన్ని మాత్రమే చేరుకున్నాయి... మిగతా శాఖల పరిస్థితి దాదాపు అలాగే ఉంది..... రాబోయే బడ్జెట్లోగా ఈ సమస్యల పరిష్కరించాలని ఏపీ సర్కారు తీవ్రంగా కృషి చేస్తోంది.. బడ్జెట్ అంచనాలపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7వేల కోట్ల రూపాయలవరకూ ఆదాయం తగ్గిందని అంచనావేశారు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, మైన్స్, అటవీ శాఖలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాయి.. ఎక్సైజ్, కమర్షియల్ టాక్సు శాఖలవల్ల రెవెన్యూ లోటు ఉందని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది..