వార్తా చానళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తెలిపారు. వార్తల నాణ్యత లోపించడంపై, పాత్రికేయులకు శిక్షణ కోసం చాలా తక్కువ వ్యయం చేస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.