
రైతుల అంగీకారం లేకుండా భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూ సేకరణ చేయడాన్ని వామపక్షాలు ఎప్పటికీ అంగీకరించవన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోని 59 మండలాల్లో 4 లక్షల 11 వేల ఎకరాలకు పైగా భూములను దౌర్జన్యంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని మధు అన్నారు. చంద్రబాబుకు భూమి పిచ్చిపట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.