
ఆదివాసీ చట్టాల అమలు, అభివృద్ధిలోనూ త్రిపుర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, మార్క్సిస్టు పాలన వల్లే ఇది సాధ్యమైందని ఆ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యులు జితిన్ చౌదరి తెలిపారు.మార్క్సిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా భూమి బదలాయింపు నిషేధి త చట్టాన్ని అమలు చేసిందని, ఆదివాసీల భూమిని ఆదివాసేతరులు కొనకుండా కట్టడి చేసిందన్నారు. రాష్ట్రంలో పకడ్బందీగా భూసంస్కరణలు అమలు చేసిందని, భూమి లేని నిరుపేద లందరికీ భూములు పంచిందని తెలిపారు.