
మోడీ గుజరాత్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అతను పూర్తి చేశానని చెబుతున్న ఎంఏ సంపూర్ణ రాజనీతి శాస్త్రం (ఎంటైర్ పొలిటికల్ సైన్స్) అంశం ఆ యూనివర్సిటీ సిలబస్లోనే లేదని జయంతీ భారు పటేల్ ఆరోపించారు. 'ప్రధాని మోడీ సర్టిఫికెట్లలో పేర్కొన్న ఎంఏ పార్ట్-2 పేపర్లలో కూడా చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి. నాకున్న సమాచారం మేరకు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ విద్యార్థులకు అలాంటి సబ్జెక్టులు ఉండవు' అని పటేల్ చెప్పారు.