
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 30 ఏప్రిల్, 2025.
విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో ఈ రోజు జరిగిన చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనలో గోడకూలి 8మంది భక్తులు మరణించడం పట్ల సిపిఐ(యం) దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. వారికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తున్నది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నది.
చనిపోయిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కూడా ఉన్నారు. చనిపోయిన వారికి ఒక్కొక్కరికీ ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. గాయపడిన స్థితిని బట్టి రూ.10లక్షల వరకూ నష్ట పరిహారం అందించాలని కోరుతున్నాము.
ప్రమాదానికి కారణమైన గోడకట్టి కొద్దికాలమే అయినప్పటికీ కూలటం అంటే నాణ్యత లేదని స్పష్టంగా అర్ధమవుతున్నది. గోడకట్టిన కాంట్రాక్టరు, పర్యవేక్షించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి