
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 16 జూన్, 2025.
వర్గ, ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలి
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో బి.వి.రాఘవులు
కార్పోరేట్, మతోన్మాద కూటమి నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వర్గ, ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలనీ సిపిఐ(యం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు.
జూన్ 16,17 తేదీల్లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ/ వర్క్షాప్ మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. వర్క్షాప్ ప్రారంభంలో బి.వి.రాఘవులు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిని కూడా మత విభజనలను, ఉద్రిక్తతలను పెంచడానికి సంఫ్ు పరివారం శక్తులు అనేక ప్రయత్నాలు చేశారన్నారు. ఉగ్రవాదం, యుద్ధోన్మాదం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో అమెరికా అధ్యక్షుడి పాత్రతో కాల్పుల విరమణ జరిగిందన్న సమాచారం భారతీయులు జీర్ణం చేసుకోలేకపోయారు. దీనిపై పూర్తి వాస్తవాలు చెప్పేందుకు, ప్రత్యేక పార్లమెంట్ నిర్వహించడానికి మోడీ సర్కార్ నిరాకరిస్తున్నది. పాలస్తీనా గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమంతో పాటు ఇరాన్పై ఘోరమైన దాడికి పాల్పడుతున్నా ప్రశ్నించగల సత్తా విశ్వగురుకి లేకుండా పోయింది. బిజెపి ప్రభుత్వం ఇజ్రాయిల్తో సైనిక, భద్రతా సంబంధాలను తెంచుకోవాలని కోరారు. బిజెపి పాలనలో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, పునాదులపై ఉద్దేశపూర్వక దాడి జరుగుతున్న నేపథ్యంలో లౌకిక, ప్రజాస్వామిక వాదులు అప్రమత్తం కావాలని పిలుపు నిచ్చారు భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భంచబోతోందని అదే పనిగా ఊదరగొడుతోంది. పెరుగుతున్న అసమానతలు, కార్మికుల జీవనోపాధి, సంక్షోభం వంటి వాస్తవిక అంశాలు బయట పెట్టాల్సిన అవసరం వుందని అన్నారు.
టిడిపి కూటమి ప్రమాదకరమైన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వంతుపాడుతూ లౌకిక ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలకు రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేస్తున్నదని అన్నారు.
ఈ రాష్ట్ర కమిటీలో సిపిఐ(యం) పోలిట్బ్యూరో సభ్యులు యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి కె.లోకనాథం మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి