15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు, రేపు (16,17 జూన్‌)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో
జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రికి  లేఖ రాయాలని సమావేశం
తీర్మానించింది. ఆ తీర్మానం ప్రకారం  ముఖ్యమంత్రికి పంపిన లేఖను
ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 జూన్‌, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
                        విషయం: 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని  కోరుతూ...
అయ్యా!
        గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి 2024-25
సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత కింద సుమారు
రూ.1,121 కోట్లను కేంద్ర ప్రభుత్వం  5 నెలల కిందటే రాష్ట్రానికి విడుదల
చేసింది. ప్రభుత్వం వాటిని పంచాయతీలకు ఇవ్వక పోవడంతో గ్రామాల్లో పారిశధ్యం,
తాగునీటి సరఫరా నిలిచిపోయాయని, గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు
ఇవ్వలేకపోతున్నామని సర్పంచులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అనేక జిల్లాల్లో
ధర్నాలకు పిలుపునిస్తున్నారు. మీ నాయకత్వంలోని కూటమి ఎన్నికల ముందు చేసిన
వాగ్దానంతో స్థానిక సంస్థలకు ఊపిరి వస్తుందని భావిస్తున్న తరుణంలో
పంచాయతీలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం దృష్ట్యా  గ్రామాల్లో అభివృద్ధి
కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. గత వైసీపీ సర్కారు గ్రామ పంచాయతీలను
నిర్వీర్యం చేసింది. గ్రామపంచాయతీ సర్పంచులు పార్టీలకు అతీతంగా తీవ్ర
ఆందోళనలో ఉన్నారు వర్షాకాలం తోటి గ్రామాల్లో పారిశుధ్య పనులు కుంటుపడ్డాయి.
కావున తమరు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1121 కోట్ల రూపాయలు
ఆర్థిక సంఘం నిధులను తక్షణం గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు బదిలీ
చేయాలని కోరుతున్నాను.
అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org