ఎంఎల్‌ఏ పార్థసారథిపై చర్య తీసుకోవాలి... సిపిఐ(యం) రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 జూన్‌, 2025.

ఎంఎల్‌ఏ పార్థసారథిపై చర్య తీసుకోవాలి

సిపిఐ(యం) రాష్ట్ర  విస్తృత సమావేశం డిమాండ్‌

కర్నూలు జిల్లా ఆదోని లో ఈనెల 16న  స్థానికంగా అధికారికంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్‌సి సర్పంచ్‌ చంద్రశేఖర్‌ను వేదికపైకి పిలవకుండా అవమానించిన ఘటనపై చర్య తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్‌ చేసింది. ఈరోజు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది.

సర్పంచ్‌ ను వేదికపైకి పిలవాలని మొదట ప్రతిపాదించిన ఎంఎల్‌ఏ ఆ తరువాత అతను ఎస్సీ అని తెలియగానే ఆగిపోవడం దుర్మార్గం. కులవివక్షను ఒక ప్రజా ప్రతినిధి ఇంత నిస్సిగ్గుగా పాటించడం రాజ్యాంగ వ్యతిరేకమే కాదు అనాగరికం కూడా. ఇలాంటి వారికి పదవిలో కొనసాగే అర్హత లేదు.

ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సదరు ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం డిమాండ్‌ చేస్తున్నది.

 

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి