జూలై 9 దేశవ్యాపిత కార్మికవర్గ సమ్మెను జయప్రదం చేయండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 (ప్రచురణార్థం/ ప్రసారర్థం: సిపిఐ(యం) రాష్ట్ర విస్తృత సమావేశం నిన్న ఈరోజు (18,19 జూన్‌) విజయవాడ (మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం)లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్రకమిటీ సభ్యులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.సావిత్రి, యం.హరిబాబు, బి.కిరణ్‌ అధ్యక్షవర్గంగా జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

జూలై 9 దేశవ్యాపిత కార్మికవర్గ సమ్మెను జయప్రదం చేయండి

జూలై 9 దేశవ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర విస్తృత సమావేశం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. 2019లో కరోనా కాలంలో మోడీ ప్రభుత్వం పార్లమెంటులో కార్మిక చట్టాలు మార్పు చేస్తూ 4 లేబర్‌కోడ్స్‌గా తీసుకువచ్చింది.

కార్మికుల హక్కులను కాలరాస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్‌ కోడ్స్‌కు అనుగుణంగా ఫ్యాక్టరీస్‌చట్టం, షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనూ 8 గంటల పని స్థానంలో 10 గంటల పనిదినంగా మార్పు చేసింది. రక్షణ సౌకర్యాలు కల్పించకుండా మహిళలతో రాత్రి షిప్ట్‌లలో పనిచేయించుకునేందుకు యాజమాన్యాలకు స్వేచ్చ ఇస్తూ, శ్రామిక మహిళల హక్కులను కాలరాస్తూ చట్టంలో సవరణలు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టంలో తెచ్చిన సవరణలను రద్దు చేయాలని సమావేశం డిమాండ్‌ చేస్తున్నది.

డిమాండ్స్‌ :

(1) లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలి.

(2) విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపివేయాలి.

(3) అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్ష, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, 108,104, ఆరోగ్యమిత్ర తదితర చిరుద్యోగులు, కార్మికులకు కనీస వేతనాలు, పెన్షన్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. స్కీమ్‌ వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తించాలి.

(4) రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పనిగంటలు ఉపసంహరించుకోవాలి. రక్షణ సౌకర్యాలు, నిబందనలు అమలు చేయకుండా రాత్రిపూట మహిళలు పనిచేయ్యాలనే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.

(6) రైతులు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. డా॥ స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలి.

(7) కౌలురైతులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి. నూతన కౌలుచట్టం చేయాలి.

(8) ఉపాధిహామీ రోజు వేతనం రూ.600లు చెల్లించాలి. పట్టణ ప్రాంతాలలోనూ ఉపాధి హామీ అమలు చేయాలి.

(9) కనీస పెన్షన్‌ రూ.9,000లు చెల్లించాలి. సిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ అమలు చేయాలి.

(10) విద్యుత్‌ సవరణ చట్టం రద్దు చేయాలి. స్మార్ట్‌మీటర్లను బిగించరాదు. 

(11) భవన నిర్మాణం, ట్రాన్స్‌పోర్ట్‌, హమాలీ కార్మికులతో సహా అసంఘటిత రంగ కార్మికులందరికి సాంఘిక భద్రత కల్పించాలి.

(12) కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు మినిమం టైమ్‌స్కేల్‌ అమలు చేయాలి.

(13) మత్స్యకార్మికులందరికీ వేట నిషేద భృతి చెల్లించాలి.

జూలై 9న రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతంలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర విస్తృత సమావేశం పిలుపునిస్తున్నది.

= = = =