ప్రముఖ రచయిత, అనువాదకుడు, అభ్యుదయ మేధావి ముక్తవరం పార్థసారథి మృతి పట్ల సిపిఎం సంతాపం

ప్రచురణార్థం/ ప్రసారార్థం/ స్క్రోలింగ్ :
ప్రముఖ రచయిత, అనువాదకుడు, అభ్యుదయ మేధావి ముక్తవరం పార్థసారథి మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. వామపక్ష భావజాలంలోనూ విశ్వ సాహిత్యంలోనూ విశేష పరిజ్ఞానం గల పార్థసారథి తన యావత్ జీవితాన్ని అధ్యయనానికి, రచనలకు అంకితం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత రచనలను అనువదించి తెలుగువారికి అందజేయడానికి విశేష కృషి జరిపారని కొనియాడారు. ఆయన భార్య వసంతకు ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
-జె.జె జయరాం
ఆఫీస్ కార్యదర్శి