December

కడపలో ఉక్కుపరిశ్రమ కోసం ఆందోళన..

 కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళంపై కలెక్టర్‌ సమాధానం చెప్పాలని నినదించారు. కలెక్టర్‌ తీరును నిరసిస్తూ వాహనాన్ని కదలకుండా సిపిఎం శ్రేణులు భైఠాయిం చాయి. ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించారు. ఈ బృం దాలు కలెక్టరేట్‌లోకి చేరుకున్న వెంటనే ఉద్యమకా రులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.కలెక్టర్‌ సభాభవన్‌లోని గ్రీవెన ్‌సెల్‌ కార్యక్రమంలో ఉన్నప్పటికీ స్పందించక పోవడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీలకు వెన్నుపోటు..

అంగన్‌వాడీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమానవీయంగా ప్రవర్తిస్తూ వారి ఉసురు పోసుకుంటున్నాయి. మాతా శిశు సంక్షేమంలో, శిశు, బాలింత మరణాల నివారణలో ప్రపంచంలోనే అథమస్థాయిలో ఉండి కూడా వారికి కాస్తంత ఊరట కల్పిస్తున్న ఐసిడిఎస్‌ నిర్వీర్యానికి కేంద్రంలో బిజెపి సర్కారు కుయుక్తులు పన్నుతుండగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అదే బాటలో నడుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణే కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను ఒంటి చేత్తో ఈదుతున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం హామీ ఇచ్చి తప్పించుకు తిరుగుతోంది.

హైదరాబాద్ కు రాష్ట్రపతి ప్రణబ్

రాష్ట్రప‌తి ప్రణబ్‌ ముఖ‌ర్జీ నేటి నుంచి ఈనెల 31వ తేదీ వ‌ర‌కు హైదరాబాద్‌లో గడపనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ బస చేస్తారు. ఈ 14 రోజుల్లో ప్రణబ్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబ‌ర్ 19న సికింద్రాబాద్‌లోని మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ స్నాత‌కోత్సవంలో రాష్ట్రప‌తి పాల్గొంటారు.

20మంది అంగన్‌వాడీలకు అస్వస్థత

అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అంగన్‌వాడీల ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 20 మంది అంగన్‌వాడీలు అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీకి మద్దతు తెలిపిన సిపిఎం, సిఐటియు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

హెరాల్డ్‌కేసులోకోర్టుకు సోనియా

నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ రేపు పాటియాలా హౌజ్‌ కోర్టులో హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ ధృవీకరించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో వారు ఇంతవరకు బెయిలు బాండ్‌ నింపలేదు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

GST పై ప్రతిష్టంభన తొలగేనా..?

జిఎస్‌టి బిల్లును ఆమోదించేలా ఏకాభిప్రా యాన్ని తీసుకు రావడంలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశం విఫలమైంది. జిఎస్‌టి బిల్లుపై రాజ్యసభలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రాజ్యసభ చైర్మన్‌ హమిద్‌ అన్సారీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో జిఎస్‌టి బిల్లుకు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, పెండింగ్‌లో వున్న మిగిలిన ఆరు బిల్లులను చివరి మూడురోజుల సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలు సహకరిస్తామన్నాయి. గంటపాటు సాగిన చర్చల అనంతరం అన్సారీ మాట్లాడుతూ సమావేశం సానుకూలంగా సాగింద న్నారు.

నేడు శాసనసభలో ఐదు బిల్లులు..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రభుత్వం ఇవాళ 5బిల్లులు ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్‌ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్‌ బోర్డు బిల్లు, విలువ ఆధారిత పన్ను, విదేశీ మద్యం సవరణ బిల్లులను ప్రభుత్వం స్పీకర్‌ అనుమతితో సభలో ప్రవేశ పెట్టింది. వైకాపా సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

ప్రజలకు ప్రయోజనమేదీ? :ఏచూరి

ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతున్నా మనదేశంలో ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు ఆ ప్రయోజనాలు అందటంలేదని సిపిఎం విమర్శించింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు నానాటికీ తగ్గుతున్నాయని, ప్రస్తుత గతంలో కంటె మూడు రెట్లు ధరలు పడిపోయాయని చెప్పారు. అయితే నరేంద్రమోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను తొమ్మిదిసార్లు పెంచివేసిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిమితి దాటిన ఉత్పత్తి, అమెరికన్‌ డాలర్‌ ప్రభావంతో క్రూడాయిల్‌ ధరలు పడిపోతున్నాయని ఆయన గుర్తుచేశారు.

Pages

Subscribe to RSS - December