
శ్రీకాకుళం జిల్లాలో పోలాకి పవర్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన సిపిఎం నాయకులపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధుని దౌర్జన్యంగా అరెస్ట్ చేసారు. పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికే స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలు ఉద్యమాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని తెలుసుకుని, బాధితుల గోడు వినడానికి వెళ్లాలనుకున్ననాయకుల సమాచారం ముందుగానే తెలుసుకుని రైల్వే స్టేషన్ లో దిగగానే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.