ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రపంచబ్యాంకు పాలన

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రపంచబ్యాంకు పాలన మొదలైందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. 76,4260 ఎకరాలను కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్దమైందని ఆయన ఆరోపించారు. కార్మికసంక్షేమం పక్కన పెట్టడం వల్లనే ప్రపంచ బ్యాంకు పెట్టుబడి అనుకూలత రాష్ట్రముగా రెండం స్థానం ఏపీకి వచ్చిందని తెలిపారు. సర్కారు బలవంతపు భూసేరణ పై త్వరలో భారీ ఉద్యమం నిర్మించి రాష్ట్ర బంద్ కు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని మధు తెలిపారు. గతంలో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యుటివ్ గా పేరు తెచ్చుకున్న బాబు మరో ప్రపంచ బ్యాంకు విధానాలను అమలుపరస్తున్నారని మధు దుయ్యబట్టారు.