కార్మికులపై" ఎస్మా" ప్రయోగం

హైదరాబాద్: నగరంలో సమ్మెకు దిగిన కార్మికులు విధులకు రంజాన్, బోనాల పండుగను, అలాగే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్‌కుమార్ శుక్రవారం మరోసారి సూచించారు. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగిన కార్మికులకు నాటి నుంచి సమ్మె ముగిసే వరకు నో వర్క్ నో పేను అమలు చేస్తామని చెప్పుకొచ్చిన ఆయన శనివారం కార్మికులకు వర్కింగ్ డేగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలం క్రితం వరకు గ్రేటర్‌లో గుర్తింపు యూనియన్‌గా కొనసాగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ తాజాగా శుక్రవారం మంత్రి నాయిని నర్సింహారెడ్డితో చర్చలు జరిపి, సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. డిమాండ్లపై సర్కారు యూనియన్‌కు నెలరోజుల గడువు కోరిందని, ఈ క్రమంలో విధులు నిర్వర్తించేందుకు కార్మికులు ముందుకు రావాలని, లేని పక్షంలో వారిపమై ఎస్మా ప్రయోగించాలన్న విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.