కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన స్మార్ట్ సీటీల నామినేషన్ జాబితాలో విజయవాడకు చోటు లభించింది. వివిధ రాష్ట్రాల రాజధానులు లక్నో, ముంబయి, గాంధీనగర్, జైపూర్, భువనేశ్వర్, రారుపూర్, గౌహతిలతోబాటు విజయవాడ కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 100 స్మార్ట్ సిటీలకు నామినేట్ అయిన వాటిలో పాట్నా, కోల్కతా, బెంగుళూరులకు చోటు దక్కలేదు. ఢిల్లీతో సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులో చేరాయి. తక్కువ ప్రాముఖ్యం కలిగిన నగరాలు, మునిసిపాలిటీలను -బీహార్లోని బీహార్ షరీఫ్, ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్, సహరాన్పూర్లు, హిమాచల్లోని ధరమ్శాల, కర్ణాటకలోని శివమొగ్గలను- రాష్ట్రాలు నామినేట్ చేశాయి.