కర్నూల్లో పలు సేవా కార్యక్రమాలు..

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా  కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్, అజిముద్దీన్ నగర్, చల్లా వారి వీధి, వీరు సెక్షన్ కాలని, లక్ష్మీ నగర్ తదితర వీధులలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు బ్లీచింగ్ పౌడర్ చల్లి, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో భాగస్వాములు అయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు పి. నిర్మల, పి. ఎస్. రాధాకృష్ణ, జిల్లా నాయకులు పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఓర్వకల్లు మండలంలో ఉచితంగా కూరగాయల పంపిణీ చేశారు.