June

జులై 14న రాష్ట్రస్థాయి దళిత సదస్సు

దళిత వ్యతిరేక విధానాలకు, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దళితులు ఉప్పెనలా కదలాలని సిపిఎం, సిపిఐ రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. సామాజిక న్యాయం, దళిత సంక్షేమం, సమగ్రాభివృద్ది కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి కలిసి రండి పేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి.అరుణ్‌, తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల సామాజిక న్యాయం బలైందన్నారు.

సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నాలుగేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయని, ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని సిద్దార్థ అకాడమీ ఆడిటోరియంలో జరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గురించి, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపైనా విస్తృత సమావేశంలో కూలంకషంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని సమావేశం అభిప్రాయ పడింది.

పేదల ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కై ఆందోళన

విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం మహాధర్నా నిర్వహించిన అనంతరం సిపిఎం నేతలు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌కు అందజేశారు. వినతిపత్రం అందించేందుకు నేతలు వస్తున్నారని తెలుసుకున్న కమిషనర్‌ స్వయంగా తన చాంబర్‌ నుండి బయటకు వచ్చారు. కార్యాలయం ఆవరణలో నేతల వద్ద నుండి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు కమిషనర్‌తో మాట్లాడుతూ కొండ ప్రాంతవాసులకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించాలని, కాల్వగట్లు, కృష్ణాకరకట్ట వాసులకు పట్టాలివ్వాలని, జక్కంపూడిలో శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు.

రైతాంగ సమస్యలను పరిష్కరించాలి

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం అనంతపురం (ఉత్తర) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఉదయం ప్రారంభమైన 30 గంటల సత్యాగ్రహం మంగళవారం ఉద్రిక్తత నడుమ ముగిసింది. పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ లక్ష సంతకాలతో కూడిన రైతుల వినతి పత్రాలను పోలీసులు నేలపాలు చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను, కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

Pages

Subscribe to RSS - June