2018

భోగాపురం ఎయిర్ పోర్టు పనులను జి.ఎం.ఆర్ కు కేటాయించడంపై ఆందోళన

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను దక్కించుకున్న ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) కి కాకుండా ప్రైవేట్ సంస్థ అయిన జి.ఎం.ఆర్ కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ నగరంలో వున్న తాజ్ హోటల్ (గేట్ వే) లో భోగాపురం ఇంటర్నేషనల్ ఫ్రీ అప్లికేషన్ కాన్పెరెన్స్ ను రద్దు చేయాలని, నిర్మాణ పనులు ఎఎఐ కి అప్పగించాలని ఆందోళన చేస్తున్న సిపిఎం కార్యకర్తలను, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. 

ప్రజాసంఘాల నాయకులు,పార్టీ నాయకులపై పెట్టిన రౌడీ షీట్లపై విచారణ జరిపి ఎత్తివేయాలని కోరుతూ

కృష్ణా జిల్లా కిడ్నీ వ్యాధి సమస్యలపై ధర్నా..

పశ్చిమ కృష్ణా ప్రాంతంలో కిడ్నీ వ్యాధిని నియంత్రించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద బాధితులు ధర్నా చేశారు. వ్యాధి వల్ల తాము ఎక్కువ సేపు కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు చేయూత లేకపోవడంతో ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా చేస్తానన్న సిఎం చంద్రబాబునాయుడు మరింత రోగాంధ్రగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ వ్యాధి సమస్య ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చినా నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు.

Pages

Subscribe to RSS - 2018