August

మాజీ సీఎంలకు ఎదురుదెబ్బ

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఆరుగురికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెండు నెలల్లోపు ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాల్సిందిగా జస్టిస్ అనిల్ ఆర్ దవే సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.ఆదేశాలు అందుకున్నవారిలో మాజీ సీఎంలు మాయావతి, ములయాం సింగ్ యాదవ్, ఎన్డీ తివారి, కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్, రామ్ నరేష్ యాదవ్ ఉన్నారు

ప్రత్యేక హోదా సాధనకై రాష్ట్రవ్యాప్త బంద్

ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆగస్టు 2న జరపబోయే బంద్ లో పాల్గొనాలని కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ . నరసింగరావు ప్రజలకు  పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 అమలు చేయవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్రంలో అధికారానికి వచ్చిన బిజెపి గత రెండు సంవత్సరాలు నుంచి కుంటిసాకుతో విభజన చట్టంలోని ఈ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా జాప్యం చేసింది.విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదు. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధంకావడంలేదు.

సెప్టెంబర్‌ 2 సమ్మె జ‌య్ర‌ప‌దానికై కార్మిక‌సంఘాల ఆధ్వ‌ర్యంలో స్కూట‌ర్‌ర్యాలీ

 సెప్టెంబర్‌ 2 దేశవాపితంగా కార్మికవర్గం చేపడుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక‌వ‌ర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల‌ని సిఐటియు నాయ‌క‌త్వంలో భారీ స్కూట‌ర్ ర్యాలీ జ‌రిగింది. ఈ స్కూట‌ర్ ర్యాలీ జివిఎంసి కార్యాల‌యం వ‌ద్ద ప్రారంభ‌మై జ‌గ‌దాంబ‌, క‌లెక్ట‌ర్ ఆఫీస్‌, చౌట్రీ, పూర్ణామార్కెట్‌, కొత్త‌రోడ్‌, రైల్వేస్టేష‌న్‌, గురుద్వార్‌, హెచ్‌.బి.కాల‌నీ, వెంకోజీపాలెం, ఎం.వి.పి., మ‌ద్దిల‌పాలెం, కాంప్లెక్స్ మీదుగా జ‌గ‌దాంబ సిఐటియు కార్యాల‌యం వ‌ర‌కు జ‌రిగింది.

క్రమబద్దీకరణ వంద గ‌జాల‌కు పెంచాలి

1. పంచగ్రామాల‌ భూ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది. 2008లో దేవస్థానం 419 ఉన్న ఇళ్ళ నిర్మాణాల‌పై సర్వే చేసిన వాటి ఆధారంగా 12149 ఇళ్ళను క్రమబద్దీకరణ చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. 60చ॥గజాల వరకు ఉచితంగా, 61-300 చ॥గజాల‌ వరకు 1998 నాటి భూ మలువలో 70శాతం మరియు 9శాతం వడ్డీ, 301 చ॥గజాల‌ పైబడిన వాటికి (రెండోకేటగిరి విలువ మరియు) ప్రస్తుత భూ విలువపై గృహయజమానులు ప్రభుత్వానికి డబ్బుచెల్లించి క్రమబద్దీకరించుకోవాల‌ని ప్రభుత్వ క్యాబినెట్‌ ప్రకటించింది.

సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?

ప్రపంచీకరణ నేప థ్యంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ వర్గాల ఒత్తిళ్ల వల్ల 1991 నుంచి పాలకవర్గాలు అవలంబిస్తున్న సరళీ కరణ ఆర్థిక విధానాలు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆది నుం చీ కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కార్మికవర్గాన్ని ఒక వర్గంగా ఐక్యంచేయటానికి కృషి జరుగుతున్నది. వివిధ కార్మిక సంఘాల నాయకత్వంలోని కార్మిక వర్గం ఇప్పటికే 15 సార్లు సార్వత్రిక సమ్మెలు చేసి, ఈ విధానాలను తాము తుదికంటా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రయివేటీక రణ, సరళీకరణ విధానాల అమలు వేగం తగ్గింది. అయినా వాటి అమలు కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

చంద్రబాబుది హోల్‌సేల్‌ దోపిడీ..

 రాష్ట్రంలో చంద్రబాబు హోల్‌సేల్‌గాను, దిగువ స్థాయి నాయకులు రిటైల్‌గాను దోపిడీ చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ఎన్‌ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులపైనా టిడిపి రౌడీలు దౌర్జన్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లా డుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిసుంటే రూ. 2 లక్షల కోట్లు నిధులు ఎపికి వచ్చే ఉండేవన్నారు. ఎపి విభజనతో రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్లు రావాల్సి ఉంటే, సిఎం తన ఆత్మగౌరవం తాకట్టు పెట్టి భిక్షం ఎత్తుకొంటున్నారని ఎద్దేవా చేశారు. 

Pages

Subscribe to RSS - August