January

పెద్దలకు కట్టబెట్టేందుకే...

 గత సంవత్సర కాలంగా 9/77 అసైన్డ్‌ చట్ట సవరణపై చర్చ జరుగు తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. త్వరలో ఈ చట్టాన్ని సవరిస్తామని, అసైన్డ్‌ భూములకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చట్ట సవరణపై చర్చిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించటంతో మరీ వేడెక్కింది. ఈ చట్టం ఉద్దేశం ఏమిటి? ఎవరి రక్షణ కోసం ఈ చట్టం వచ్చింది? ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉబలాట పడుతోందనేదాన్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 9/77 చట్టాన్ని సవరించింది.

సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

వచ్చే వార్షిక బడ్జెట్‌లో వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహిగా మిగిలిపోతారని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి చంద్రబాబే ఆటంకమని విమర్శించారు. మదనపల్లి బిటి కళాశాల ఆవరణలో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సుకు ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు.

దిగొచ్చిన పోర్టు యాజమాన్యం

కాకినాడ ; కార్మికులు ఆందోళన ఉధృతం చేయడంతో పోర్టు యాజమాన్యం దిగొచ్చింది. ఆల్‌బెస్ట్‌ కార్మికులకు నష్టపరిహారం అందించేం దుకు రాతపూర్వక ఒప్పందం చేసుకుంది. 20 రోజులుగా కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ఆల్‌బెస్ట్‌ కంపెనీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించలేదు. దీంతో శుక్రవారం వారు ఆందోళనను ఉధృతం చేశారు. వివిధ కంపెనీల కార్మికులు విధులను బహిష్కరించి వీరికి అండగా నిలిచారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సమక్షంలో రాతపూర్వక ఒప్పందం జరిగింది.

Pages

Subscribe to RSS - January