January

అభివృద్ధి మంత్రం - అసలు తంత్రం!

ఈ మధ్య విజయవాడ పుస్తక ప్రదర్శనలో ప్రసంగించిన తర్వాత నాతో మాట్లాడిన వారిలో ఇద్దరు విద్యాధికులు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రధాన భాగాన్ని అభినందిస్తూనే అమరా వతిని భ్రమరావతి అని వర్ణించడం ఎందు కని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేస్తే మంచిదే కదా అని అడిగారు. అమరావతిపై అనేకసార్లు ఈ శీర్షికలో చెప్పుకున్నాం. మొన్నటి మంత్రి వర్గ సమావేశం తర్వాత ఒక సీనియర్‌ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి సింగపూర్‌పై చాలా ఆశలు పెట్టుకున్న మాట నిజమైనప్పటికీ వారి నుంచి అంత సహకారం రాలేదని చెప్పారు. ఈ కారణంగా హడ్కో రుణ సహాయంతో తామే నిర్మాణం చేపట్టవచ్చని సూచించారు.

బిసిల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలి - ప్రొఫెసర్‌ దుర్గాప్రసాద్‌, జమలయ్య డిమాండ్‌

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, బిసిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన వేదిక రాష్ట్ర గౌరవ సలదారులు ప్రొఫెసర్‌ ఎ.దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్‌ ఛైర్మన్‌ గంటా శ్రీరామ్‌ అధ్యక్షతన స్థానిక వివేకానంద హాలులో ఆదివారం జిల్లా సదస్సు జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు.

'బాక్సైట్‌'పై ఐక్య ఉద్యమం, ఏజెన్సీలో నిర్బంధం ఆపి కేసులు ఎత్తివేయాలి - గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాబూరావు

ప్రజా ప్రయోజనాల పేరుతో గిరిజనుల జీవితాలను ఫణంగా పెట్టి కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసం బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న పాలకుల నిరంకుశ చర్యలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నార్ల వెంకటేశ్వరరావు భవన్లో 'జువార్‌ నేస్తం' పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.

రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన వారిని క‌ఠినంగా శిక్షించాలి

దళిత పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల‌ ఆత్మహత్యకు కారకులైన విసి అప్పారావు, కేంద్ర‌మంత్రులైన బండారు, స్మృతి ఇరానీల‌ను కూడా  కఠినంగా శిక్షించాల‌ని కోరుతూ శుక్రవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ బంద్‌ పూర్తిగా జయప్రదమయ్యింది. వేలాదిమంది విద్యార్ధులు తమ తరగతుల‌ను బహిష్కరించి  భారీ ర్యాలీ నిర్వహించారు. గత రెండురోజుల‌ నుండి ఎస్‌.ఎఫ్‌.ఐ నాయ‌కులు ప్రతి విద్యార్ధిని కలిసి కరపత్రాలు పంపిణీచేసి బంద్‌లో పాల్గొవాల‌ని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది.

ఈవీఎంలలో ‘టోటలైజర్‌’..

ఓటర్ల వివరాలను మరింత గోప్యంగా ఉంచేందుకు వీలుగా ఈవీఎంలలో ‘టోటలైజర్‌’ అనే కొత్త పరికరాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.టోటలైజర్లను ఏర్పాటు చేయాలని ఈవీఎం తయారీదారులైన ఈసీఐఎల్‌, బీఈఎల్‌ కంపెనీలకు ప్రభుత్వంలో గతంలోనే సూచించింది.

ఫోరెన్సిక్‌కు రోహిత్‌ సూసైడ్‌ నోట్

దళిత స్కాలర్‌ రోహిత్‌ వేముల చివరగా రాసిన ఆత్మహత్య లేఖను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆ లేఖను ఫోరెన్సిక్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే రోహిత్‌ మృతితో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో మిగతా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ నిలిపివేశారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రోహిత్‌ మృతికి కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, హెచ్‌సియూ వైస్‌ ఛాన్స్ లర్‌ అప్పారావును తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు రోహిత్‌ సూసైడ్‌ పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్‌ టారిఫ్‌కి కేబినెట్‌ఆమోదం

స్వచ్ఛమైన విద్యుత్‌ను అందించటంతో పాటు విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కం)పై మెరుగైన నియంత్రణ, రంగంలోకి వేగంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన కొత్త విద్యుత్‌ టారిఫ్‌ విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. స్వచ్ఛమైన విద్యుత్‌, డిస్కంలపై మెరుగైన నియంత్రణతో పాటు స్వచ్ఛబారత్‌ కార్యక్రమానికి మద్దతుగా రూపొందించిన విద్యుత్‌ టారిఫ్‌ విధానానికి కేబినెట్‌ ఆమోదం లభించిందని కేబినెట్‌ భేటీ అనంతరం ప్రభుత్వవర్గాలు వివరించాయి. 

రైల్వేలో ప్రైవేట్‌కు పెద్దపీట..

భారత్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు పన్నుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం దావోస్‌ వేదికపై నుంచి ప్రకటించారు. దేశంలో సులభ వ్యాపారానికి, పెట్టుబడులకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసేందుకు పన్నుల విధానాన్ని సంస్కరిస్తామని ఆయన విదేశీ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. రైల్వే రంగంలో ప్రైవేట్‌కు పెద్ద పీట వేస్తామని, అన్ని రంగాల్లోనూ ఎఫ్‌డిఐలకు ప్రాధాన్యతనిస్తామని రాయితీల వర్షం కురిపించారు.

SFI జాతీయ మహాసభలు..

దేశంలో అమలవుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ, విద్యార్థి సమస్యలపై గలమెత్తే భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) 15వ అఖిల భారత మహాసభలు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లోని సికార్‌లో జరుగనున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ చరిత్రలోనే రాజస్థాన్‌లో తొలిసారిగా ఈ సభలు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు నితీష్‌ నారాయణ్‌ ప్రజాశక్తికి వివరించారు.సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేతులు మీదుగా ప్రారంభం కాబోయే బహిరంగ సభకు ముందు పదివేల మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. 

Pages

Subscribe to RSS - January