May

ప్రజారోగ్యంలో మేటి క్యూబా

క్యూబాలో ప్రజారోగ్యం అగ్రరాజ్యా లను తలదన్నే విధంగా ఉంది. 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రాధాన్యతల్లో ఆరోగ్యానికి అగ్రస్థానం ఇచ్చింది. రాజ్యాంగంలో ఉన్న 'ఆరోగ్య హక్కు' అక్షరాలా అమలవుతున్నది. ప్రపంచ దేశాలు క్యూబాలోని ప్రజారోగ్యాన్ని ఒక ఆదర్శంగా భావిస్తున్నాయి. క్యూబాలోని ఆరోగ్య వ్యవస్థను శత్రువులైనా, మిత్రులైనా కొనియాడక తప్పడంలేదు. 1.5 కోట్ల జనాభా కలిగిన క్యూబా దేశం ఆరోగ్యంలో గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నది. 1959 క్యూబా విప్లవం జయప్రదం అయినప్పటి నుంచి ''సార్వత్రిక ఆరోగ్య రక్షణ'' ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత పథకంగా సోషలిస్టు క్యూబాలో అమలు జరుగుతున్నది.

సిపియం కేంద్ర కార్యాలయం పై దాడిని ఖండిస్తూ

సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడిని ఖండిస్తూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేరళలో లెఫ్ట్ పార్టీల విజయాన్ని తట్టుకోలేకే బీజేపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మతోన్మాదాన్ని ఎదుర్కొంటున్నందుకే బిజెపి దాడులు

దేశ సమగ్రత, సమైక్యతల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సిపిఎంపై కుట్ర చేయటానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి శక్తులు యత్నిస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి, ఎబివిపి గూండాలు దాడికి యత్నించటాన్ని నిరసిస్తూ ఆదివారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ బస్‌స్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పుణ్యవతి మాట్లాడుతూ పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి జరగటం ప్రధానికి తెలియకుండా జరగే అవకాశం లేదని, మోడీ ప్రోద్భలంతోనే ఇది జరిగిందన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. 

కేరళలో LDF తిరుగులేని ఆధిక్యం

కేరళ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ భారీ తిరుగులేని విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోభాగంగా ఈ నెల 16న జరిగిన 14వ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ 91 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(యుడిఎఫ్‌)47 స్థానాలను గెలుచుకుంది. 

రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేనట్టే..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ యాత్ర మరోసారి బెడిసికొట్టినట్లే కనిపిస్తోరది. షరా మామూలుగానే ఈసారీ ప్రధాని మోడీ ముఖం చాటేశారని అధికారులంటున్నారు. బిజెపి మంత్రు లు, నేతలు చెబుతున్న మాటలనే ఈసారి మోడీ కూడా అంతర్లీనంగా వ్యక్తీకరిరచినట్లు విశ్లేషిస్తున్నా రు. ప్రధానిని గట్టిగానే అడిగామని, సాయం వస్తురదని చంద్రబాబు చెబుతున్నప్పటికీ, వాస్తవాని కి అనుకూల సంకేతాలు రాలేదంటున్నారు. చంద్రబాబు పర్యటనలో వాస్తవ షెడ్యూల్‌గా ఉన్న కరువుపై మన మంత్రులు, అధికారులు పెద్దగా స్పరదిరచలేదని స్పష్టమవుతోరది. 

దోపిడీలేని సమాజం కోసం ఉద్యమం......

పుచ్చలిపల్లి సుందరయ్య స్ఫూర్తితో దోపిడీ, పీడనలేని సమాజం కోసం ప్రజలంతా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపు నిచ్చారు. విజయనగరం పట్టణంలోని ఎల్‌బిజి నగర్‌లో సుందరయ్య వర్థంతి సభను గురువారం నిర్వహించారు. నాయకులు పి.రమణమ్మ అధ్యక్షతన అనంతరం జరిగిన సభలో కృష్ణమూర్తి మాట్లాడారు. సుందరయ్య సంపన్న కుటుంబలో పుట్టినప్పటికీ సమాజంలో కులతత్వాన్ని, దోపిడీని చిన్నప్పుడే వ్యతిరేకించారన్నారు. పేదలు, కష్టజీవులు, సామాన్యులు, మహిళలు ఆత్మగౌరవంతో బతికే వ్యవస్థ కోసం కృషి చేశారన్నారు. ప్రతిఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ అందాలన్న లక్ష్యంతో చివరి వరకూ పనిచేశారని చెప్పారు.

హామీలను అమలు చేయాలని ధర్నా

చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే జిల్లాలలో పర్యటించాలని లేదంటే చంద్రబాబు నాయుడు పర్యాటనను అడ్డుకుంటామని సిపిఎం నాయకులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నాకార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఏ జిల్లా పర్యటనకు వెళ్లిన అక్కడ సమస్యలను పరిష్కరించాలని కోరిన వారిని అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని..తాము సిపిఎం గా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని జిల్లా కార్యదర్శి శేషబాజ్జి తెలియజేశారు.

న్యాయవ్యవస్థ లక్ష్మణరేఖ గీసుకోవాలి:జైట్లీ

న్యాయ వ్యవస్థ తనకు తాను లక్ష్మణరేఖ గీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సూచించారు. స్వతంత్రత పేరుతో ఇతర విభాగాల్లో జోక్యం చేసుకోవడం తగదని జైట్లీ అన్నారు. చట్టాల ను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని, అయితే..విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం శాసన వ్యవస్థదేనని ఆయన స్పష్టం చేశారు. 

జయ, మమతకు మళ్లీ పట్టం

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు సోమవారం పోలింగ్‌ ముగియడంతో గత రెండు మాసాలుగా ఐదు రాష్ట్రాల్లో పలు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు రావడానికి మరో మూడు రోజులు మిగిలివున్న నేపథ్యంలో సోమవారం పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌ ఫలితాలు వెలువడ్డాయి. కేరళలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పాలక యుడిఎఫ్‌ను కూలదోసి సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ విజేతగా ఆవిర్భవిస్తుందని సి ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి.

Pages

Subscribe to RSS - May