June

నూతన మద్యం విధానంపై నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని నిరసిస్తూ మంగళవారం విజయవాడ బీసెంట్‌ రోడ్డులో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మద్యం భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 'నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలి, వద్దు వద్దు మద్యాంధ్రప్రదేశ్‌, మంచినీరు నిల్‌-మద్యం పుల్‌' అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.ముందుగా సిపిఎం నగర కార్యాలయం నుంచి ఆందోళనకారులు ప్రదర్శనగా బీసెంటర్‌ రోడ్డులోని అన్సారీపార్కు వద్దకు చేరుకున్నారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అంబేద్కర్‌ వారసత్వం

మేధావి మరియు సామాజిక విప్లవ కారుడు అయిన డా|| బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా మరీ ముఖ్యంగా హిందూ మితవాదులు ఆయనను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆయన చేసిన కృషి, వారసత్వంపై ఒక అంచనా.

ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృ‌తి కోసం ఉద్యమించాలి

కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య గారి శత జయంతి సందర్భంగా ఈరోజు సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడమని కోరారు. ఇంతకుముందు భాషా వికాసం గురించి మాట్లాడిన కొత్తపల్లి రవిబాబుగారు నాకో కరపత్రం ఇచ్చారు. మాతృభాష ప్రాధాన్యత గురించి ఛాయారాజ్‌గారు రాసిన మంచి కవిత్వం దానిలో ఉంది. అందులోని చివరి చరణాలు.
''అమ్మా నీ భాష కావాలి.
నిప్పులు చెరగటానికి..
చెమటను జల్లెడ పట్టి సంపదలను తీయడానికి..
తెలుగు పౌరుషాగ్నిని రాజేయడానికి.. మాతృభాష కావాలి..''

భారత్‌ - చైనా

భారత్‌, చైనాల మధ్య అభివృద్ధిలో పోలికలు ఈనాటివి కావు. రెండు దేశాలూ రెండేళ్ల తేడాతో విముక్తి పొందడం, జనాభాలో, ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ పోలికలు నాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వం చైనా భారత కన్నా వెనుకబడి ఉండేది. సోషలిస్టు నిర్మాణం తరువాతా, 1980 దశకంలోనూ చైనా అప్రతిహత అభివృద్ధి సాధించడంతో భారత్‌ను అధిగమించి ముందుకు పోయింది. గత 20 ఏళ్లకు పైగా రెండంకెల అభివృద్ధితో నడుస్తున్న చైనా వేగం మందగించిందనీ, భారత్‌ వచ్చే ఏడాది అభివృద్ధిలో దాన్ని అధిగమిస్తుందనీ ఆర్థిక పండితులు, సంస్థలు చెబుతున్నాయి.

రాజరికంపై గిరిజనుల తిరుగుబాటు బావుటా కామ్రేడ్‌ దశరథ దేవ్‌

                      సిపియం కేంద్రకమిటి సభ్యులు, త్రిపుర రాష్ట్ర మాజీముఖ్యమంత్రి దశరథ్‌దేవ్‌ శతజయంతి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండవతేదీ నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి రెండవతేదీన అగర్తలాలోని రవీంద్ర శతవార్షిక భవన్‌లో జరిగిన సభలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి, సిపియం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ దశరథ్‌దేవ్‌ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. 'రాజా దశరథ్‌' అని గిరిజనులు ముద్దుగా పిలుచుకొనే దశరథ్‌ దేవ్‌ ఖోవారు సబ్‌డివిజన్‌లోని సుదూర గ్రామమైన అంపురాలో 1916 ఫిబ్రవరి రెండవ తేదీన పేదగిరిజన రైతు కుటుంబంలో జన్మించాడు.

Pages

Subscribe to RSS - June