February

సిమెంట్‌ఫ్యాక్టరీ నిర్మాణానికి సేకరించిన భూముల్లో పరిశ్రమలు వెంటనే స్థాపించాలి : సిపిఎం

పల్నాడు ప్రాంతంలో సిమెంట్‌ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేటాయించిన భూములలో వెంటనే పరిశ్రమలు స్థాపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం స్థానిక కన్నెగంటి హనుమంతు భవన్‌లో సిపిఎం నాయకులు లేళ్ల లక్ష్మిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన జరిగిన సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రామారావు మాట్లాడుతూ 12సంవత్సరాల క్రితం సిమెంట్‌ఫ్యాక్టరీల కోసం వివిధ ప్రైవేటు సంస్థలు 12వేల ఎకరాలు భూములను పల్నాడు ప్రాంతంలో సేకరించారని ఇప్పటి వరకూ ఒక్కఫ్యాక్టరీ కూడా నిర్మించలేదన్నారు.

లాభాలు పెద్దలకు-రోగాలు ప్రజలకు..

చంద్రబాబు ప్రభుత్వం రెండంకెల అభివృద్ధి జపం చేస్తున్నది. రెండంకెల అభి వృద్ధి సాధన కోసం ఎన్నుకున్న రంగా ల్లో కీలక మైనది ఆక్వారంగం. రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా ఆక్వా సాగును ప్రోత్సహిస్తా మని, రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యం గా పై మూడు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధికారికంగానూ, అనధికారికం గానూ లక్షలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువు లుగా మారాయి. ఇంకా మారుతు న్నాయి.

ఉపాధి పనుల కల్పనలో ప్రభుత్వం విఫలం

రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధిపనులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎం.రవి, ఆర్‌. చంద్రశేఖర్‌ విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. సోమవారం సంఘం నాయకులు రాజధాని ప్రాంత గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరులో పర్యటించారు. మల్కాపురం నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఆరు, ఏడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని మహిళా కార్మికులు సంఘం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కుచ్చుటోపీ..

పోలవరం ప్రాజెక్టు కథ-చారణా కోడికి బారణా మసాలా లాగా ఉంది. కేవలం నాబార్డు రుణంతో సరిపెట్టారు. కానీ, గమనార్హమైన అంశమేమంటే నాబార్డుకు పెట్టుబడి నిధి క్రింద రూ.9,020 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచే ఎఐబిపి జాతీయ హోదా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు నాబార్డు నుంచి నిధులు ఎంత వరకు లభిస్తాయి. రూ.16 వేల కోట్లు అంచనా ప్రకారం ఇంకా రూ.3,829 కోట్లు రాష్ట్రానికి రావాలి. పైగా ప్రాజెక్టు అంచనాలు పెరిగితే నీతి ఆయోగ్‌ అమోదం పొందాలి. ఇదంతా ఒక విష వలయం. రాష్ట్ర ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న భ్రమ.

Pages

Subscribe to RSS - February