February

ఆంజనేయులకు ప్రాణం పోశారు

అంకితభావం, వృత్తి నైపుణ్యంతో జిజిహెచ్‌ వైద్యులు అద్భుత రీతిలో శస్త్రచికిత్సలతో చేసి, అరుదైన స్దితిలో వ్యక్తికి ప్రాణం పోయడం సర్వత్రా హర్షణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అభినందించారు. రౌడీషీటర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో జిజిహెచ్‌లో చేరిన సిపిఎం శాఖ కార్యదర్శి ఆంజనేయులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అత్యంత తీవ్రత కలిగిన ముఖంపై గాయాలతో మరణం అంచున నిలిచిన ఆంజనేయులుకు జిజిహెచ్‌లోని వివిధ విభాగాల వైద్య నిపుణులు శ్రమించి అరుదైన శస్త్రచికిత్సలు చేయడంతో ఆంజనేయులు బతికి బయటపడ్డారని పేర్కొంటూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు వైద్య నిపుణులకు ఘనసత్కారం చేశారు.

అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రం

కొవ్వాడ అణుపార్కు భూసేక‌ర‌ణ‌ను ప్ర‌తిఘ‌టిండి
అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రం
---సిఐటియు రాష్ట్ర ఉపాధ్య‌క్షులు సి.హెచ్‌.న‌ర్సింగ‌రావు

ఇరానీపై అట్టుడికిన పార్లమెంట్‌..

స్మృతిఇరానీ అంశంతోపాటు, కేంద్ర సహాయ మంత్రి రామ్‌శంకర్‌ కటారియా 'విద్వేష' ప్రసంగం, ఎయిర్‌సెల్‌- మ్యాక్సెస్‌ వ్యవహారం ఉభయసభలను కుదిపేశాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు అన్నాడిఎంకె సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు అడుగుముందుకు పడకుండా బుధవారానికి వాయిదా పడ్డాయి. హెచ్‌సీయూ, జేఎన్‌యూ వ్యవహారంలో హెచ్‌ఆ ర్‌డి మంత్రి స్మృతిఇరానీపై 'తప్పుడు ఆధారాల అంశం'పై కాంగ్రెస్‌తో పాటు వామపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.

దివీస్‌ విస్తరణ ఆపకుంటే పోరు తీవ్రం

చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ విస్తరణ పనులను ఆపకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం హెచ్చరించారు. యూనిట్‌ 3 నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో చిప్పాడ పంచాయతీ పరిధిలోని సిటీనగర్‌ జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం లోకనాధం దీక్షాశిబిరాన్ని ప్రారంభించారు.

స‌మ‌ర‌శీల ప్ర‌తిఘ‌ట‌న‌

                 శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని వంశధార నిర్వాసితులు ఆదివారం సమరశీల ప్రతిఘటన చేశారు. తమ భూములకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా పోలీసు బలగాలతో పనులు చేయిస్తుండ టంపై తీవ్ర ఆగ్రహం చెరదారు. శనివారం తమ ఆందోళనా శిబిరాన్ని పోలీసులు కూల్చి వేయడంపై ఆగ్రహంతో ఉన్న నిర్వాసితులు సెక్షన్‌ 30ని ధిక్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనుల కోసం అధికారులు వేసిన రేకుల షెడ్డును కూల్చివేశారు. అక్కడున్న పరికరాలను వంశధారలో పడేసి తమ నిరసనను ప్రభుత్వానికి చూపారు. అంతేకాదు స్థానిక తహశీలుదారును ఘెరావ్‌ చేశారు.

ఇళ్ళులేనివారికి ఇళ్ళు, పట్టాలు, రిజిస్ట్రేషన్‌ సమస్యులు పరిష్కరించాల‌ని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా

ఇళ్ళులేనివారికి ఇళ్ళు, పట్టాలు, రిజిస్ట్రేషన్‌ సమస్యు పరిష్కరించాల‌ని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా ముఖ్యమంత్రికి పేద పట్ల చిత్తశుద్ది లేదని నేత విమర్శ

  ముఖ్యమంత్రి పేద పట్ల చిత్తశుద్దిలేదని, వుంటే  ఎన్నికల‌ వాగ్ధానం మేరకు పేదల‌కు ఇళ్ళు, పట్టాలు ఇవ్వాల‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు శ్రీ సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. పేదకు ఇళ్ళు, స్థలాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ సిపిఎం, సిపిఐ, వామపక్షా ల నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని తహశీల్థార్‌ కార్యాయం వద్ద ధర్నాలో ఆయన ప్రసంగించారు.  296 జీవో ప్రకారం కొండ, రెవిన్యూ స్థలాల్లో జీవిస్తున్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినా  ఏదో ఒక కారణంతో పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని, జీవో ఎందుకు ప్రజకు ఉపయోగం లేదనందున అదులో మార్పు చేయాని కోరారు.

19.78 లక్షల కోట్ల బడ్జెట్..

2016-17 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్న సమయంలో తాను బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నానని, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. తాము సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యోల్బణం 9శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందన్నారు. భారత్‌ 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించారు. లోక్ సభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సంబంధించి 19.78 లక్షల కోట్ల  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

5లక్షలఆదాయం.. పన్ను రాయితీ

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2016-17 బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులు లేదని పేర్కొన్నారు. రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను రాయితీ 2వేల నుండి 5వేలకు పెంచారు. 

Pages

Subscribe to RSS - February