February

రాజ్ నాథ్ వ్యాఖ్యలపై కరత్ మండిపాటు

ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమం వెనుక పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా అధ్యక్షుడు హఫీజ్‌ సయీద్‌ మద్దతు ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) నేత ప్రకాశ్‌కరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ట్విట్టర్‌ల సమాచారం ఆధారంగా రాజ్‌నాధ్‌ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. 

ప్రతిపక్షాలతో బడ్జెట్‌ భేటీ..

వచ్చే వారం ఆరంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నేడు ప్రధాన ప్రతిపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నేతలకు మోడి ఆహ్వానం పంపినట్లు ఓ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఇది అఖిలపక్ష సమావేశం కాదని, పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుల గురించి ఈ సమావేశంలో చర్చించారని ఆ అధికారి తెలిపారు.

కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసన

సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాల దాడిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పలుచోట్ల ఇతర వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రదర్శనలు, రాస్తారోకోలు, సంఘపరివార్‌ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. కొన్నిచోట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

సి పియం కేంద్ర కార్యాలయం పై దాడికి నిరసన

సి పియం  కేంద్ర కార్యాలయం పై బి జే పి నాయకుల దాడిని కండిస్తూ చిత్తూర్ జిల్లా తిరుపతిలో నిరసన కార్యక్రమం  చేపటారు. ఈ  కార్యక్రమం లో వామపక్ష నాయకులూ, కార్మిక ప్రజసంగాలు పాల్గొనారు .

సి.పి.ఎం. పార్టీ కేంద్ర‌కార్యాల‌యంపై కాషాయ‌మూక‌ల దాడిని ఖండిస్తూ కాషాయ‌కూట‌మి దిష్టిబొమ్మ ద‌గ్దం.

వామపక్ష శక్తుల విచ్ఛిన్నం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదు. - రామారావు

అభ్యుదయ, వామపక్ష శక్తులను విఛ్చిన్నం చేయటం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదని, పేద, ధనిక తారతమ్యాలు ఉన్నంత కాలం ఆయా శక్తులుంటాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని నిరశిస్తూ ఆదివారం నగర పార్టీ కార్యాలయం నుండి శంకర్‌ విలాస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఢిల్లీలోని జెఎన్‌యు ఎంతో మంది మేధావుల్ని, దేశానికి నాయకుల్ని అందించిందన్నారు.

ప్రజాస్వామ్యంపై దాడే

        సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్రం కార్యాలయంపై దాడులను సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మతోన్మాద శక్తులకు ప్రజలే ఘోరి కడతారని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. మతోన్మాద మత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు.

సిపియం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని ఖండించండి.

సిపియం కేంద్ర కార్యాలయంపై ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దుండగల దాడిని సిపియం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనను ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు ఖండించాలని  కోరుతున్నాం.

Pages

Subscribe to RSS - February