July

జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు నిరంతర విద్యుత్‌ కల్పించండి

             జిల్లాలోని జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు చెందిన 50 గ్రామాలకు నిరంతం విద్యుత్‌ సదుపాయం కల్పించాలని, సోలార్‌ విద్యుత్‌ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం నేతృత్వంలో ఆయా గ్రామాల నాయకులు మంగళవారం ఎపిఇపిడిసిఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్‌ ప్రాజెక్టులు) బి.శేషుకుమార్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయలలితలకు వినతిపత్రం అందజేశారు.

గో వథపై రగులుతున్న గుజరాత్..

ఉనా పట్టణంలో గో వథకు పాల్పడ్డారనే అనుమానంతో దళిత యువకులను అమానుషంగా హింసించిన ఘటనకు నిరసనగా గుజరాత్‌లో దళితుల ఆందోళన భగ్గుమంది. గురు వారం కూడా పలుచోట్ల ఆందోళనలు, అల్లర్లు చోటు చేసుకున్నాయి. సూరత్‌, రాజ్‌కోట్‌లలో దళితులు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు.

దయాశంకర్‌ నాలుక కోస్తే రూ.50 లక్షలు..

మాయావతిపై వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాజ్యసభలో బీఎస్‌పీ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)తోపాటు ప్రతిపక్షాలు నిలదీయడంతో అధికార పార్టీ నష్ట నివారణా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.దయాశంకర్‌ వ్యాఖ్యలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోనూ బీఎస్‌పీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చండీగఢ్‌లో బీజేపీ కార్యాలయం ముందు ఆందోళన సందర్భంగా స్థానిక బీఎస్‌పీ చీఫ్‌ జన్నత్‌ జహాన్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. దయాశంకర్‌ నాలుక కోసినవారికి రూ.50 లక్షలు బహుమతి ఇస్తానని ఆమె ప్రకటించారు. 

YCP MPలతో వెంకయ్య బిజీ

ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జీఎస్టీ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీలతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. దీనికి వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించారు.

బాబూ..కుట్రలు మాని కలసిరా..

ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతూ శుక్రవారం రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో ఎలాంటి కుట్రలు చేయకుండా ఓటింగ్‌కు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కోరారు.ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా చేయడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం ఎందుకు?

సాధారణంగా విత్తసంస్థలు (ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌) తమ ప్రాథమిక విధులు; సమాజంలో ఏర్పడే పొదుపు సమీకరించి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచే పెట్టుబడులకు ఉపయోగపడే సంస్థలుగా, వ్యక్తుల పొదుపులను వారి జీవితకాలంలో ఆ తర్వాత నూతన తరాలకు మేనేజ్‌ చేసే సంస్థగా, క్రమానుగత చెల్లింపు చేసే సంస్థగా, నష్టభయాలను (రిస్క్‌) మేనేజ్‌చేయటం, బదిలీ చేయటం వంటి విధులు నిర్వహిస్తుంటాయి. కానీ ప్రపంచీకరణ, ఉదారీకరణ ఆర్థిక విధానాల ద్వారా బడా విత్తసంస్థలు నిజ ఆర్థిక వ్యవస్థ రంగాలకు వాటి వృద్ధికి దోహదపడే విత్తవనరులు సమకూర్చటం లేదు.

ప్రత్యేక బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఏపీ పున ర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణ చేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం ఓటింగ్‌ జరుగనుంది. 

పోలీసుల మౌనం ఎందుకు ..? :కేజ్రీ

గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఉనాలో దళితులపై దాడి చేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.

దళితులకు ఆర్థిక సాధికారత:ఏచూరి

దళితులపై దాడులు నివారించాలంటే మహాత్మగాంధీ చెప్పినట్టుగా 'మనసు' మార్చుకుంటే సరిపోదని, అణగారిన వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించాలని సీపీఐ(ఎం) రాజ్యసభాపక్ష నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దళితులపై దాడులు చేసేందుకు నూతన ద్వారాలు తెరిచిందని విమర్శించారు. గోసంరక్షణ, యూనివర్శిటీలు, అవమానకర వ్యాఖ్యలు ఇవన్నీ అందులో భాగమని చెప్పారు. దళితులపై బీజేపీ ఆలోచనా వైఖరిలో మార్పురావాలన్న ఏచూరి... సమాజంలో ఆధ్యాత్మిక ఆలోచనలకు బదులు రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరముందన్నారు. 

Pages

Subscribe to RSS - July