July

రైతు ఉసురు తీస్తున్న ఆధార్‌

ఆధార్‌ కార్డులు రైతుల ఉసురు తీస్తున్నాయి. రైతులకు అమలు చేస్తున్న అన్ని పథకాలకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు గుదిబండగా మారింది. రుణ మాఫీ మొదలుకొని విపత్తు సాయం వరకు ఏ లబ్ధి పొందాలన్నా ఆధార్‌నే అర్హత చేసింది సర్కారు. దీంతో అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ కేవలం ఆధార్‌ లేని కారణంగా లక్షలాది మంది రైతులు ప్రభుత్వ సాయానికి దూరవుతున్నారు. ఆధార్‌ లేని వారే కాకుండా సాంకేతిక కారణాలతో ఆధార్‌ నెంబర్‌ ఉన్నా సాఫ్ట్‌వేర్‌లో మ్యాచ్‌కాని వారు సైతం ప్రభుత్వ లబ్ధి పొందలేకపోతున్నారు.

పార్లమెంట్‌వద్ద తుపాకీశబ్దాలు

పార్లమెంటు దగ్గర తుపాకీ మోత కలకలం రేపింది. భారీగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే ఇది పార్లమెంటు వద్ద జరిగిన మాక్‌డ్రిల్‌ అని తెలిసింది. ఒకవైపు పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌ జిల్లా దినానగర్‌లో ఉగ్రవాద దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశ సరిహద్దులతో పాటు ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

కలెక్టరేట్ల ముట్టడి..

తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరశిస్తూ సీపీఎం నాయకులు మునిసిపల్ కార్మికులతో కలిసి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా వచ్చిన కార్యకర్తలు..కార్మికులతో కలెక్టర్ కార్యాలయం అట్టుడికింది. సీఎం డౌన్..తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను..కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.

వేదాల్లో జ్ఞానాన్ని వెలికితీయండి

విద్యార్థులు, యువత తమలోని జ్ఞానాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి తోడ్పడాలని రాజ్యసభ సభ్యుడు, బెనారస్‌ యూనివర్సిటీ చాన్సలర్‌, పద్మవిభూషణ్‌ కరణ్‌సింగ్‌ అన్నారు. ఆదివారం శామీర్‌పేటలోని బిట్స్‌ క్యాంపస్‌లో వైస్‌ చాన్సలర్‌ బిజేంద్రనాథ్‌ జైన్‌ ఆధ్వర్యంలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరణ్‌సింగ్‌ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఎంతో సమాచారం ఉందని, అందులో నుంచి జ్ఞానాన్ని వెలికితీయాలని.. ఇందుకు విద్యార్థులు, యువత చైతన్య స్ఫూర్తితో ముందడుగేయాలని కరణ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు.

కులహత్యలపై సమగ్ర చట్టం:ఐద్వా

పరువు ప్రతిష్టల పేరుతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కులదురహంకార హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర చట్టాన్ని రూపొం దించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐద్వా ప్రతినిధి వర్గం కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేసింది.ఐద్వా రూపొందించిన ముసాయిదా చట్టం ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌/కలెక్టర్‌ కులపంచాయితీలపై నిషేధాజ్ఞలు విధించవచ్చని, యువజంట, వారి కుటుంబాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకునేందుకు సుమోటోగా చర్యలు తీసుకోవచ్చని వివరించింది.

విదేశీ బాబు :రాహుల్‌

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీబాబు అయ్యారని, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు(ఒడిసి) నుంచి ప్రారంభమైన రాహుల్‌ రైతు భరోసా పాదయాత్ర కొండకమర్ల గ్రామం వద్ద ముగిసింది. 1979లో ఒడిసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరాగాంధీ పాల్గొన్న వేదిక వద్దనే బహిరంగ సభ నిర్వహించారు. ఆ ప్రాంతంలో రాహుల్‌ వేపమొక్కను నాటారు. గ్రామశివారులో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులతో సమావేశ మయ్యారు.

Pages

Subscribe to RSS - July