July

మున్సిపల్‌ సమ్మె పట్ల దళిత సంఘాల వైఖరేంటి?

 రాష్ట్రంలో గత 12 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు, మున్సిపల్‌ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించమని కోరుతూ సమ్మె చేస్తున్నారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదించిన తరువాత, పలుమార్లు అధికారులతో చర్చలు జరిగిన తరువాత అధికారుల, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. మున్సిపల్‌ ఉద్యోగులు సంప్రదాయకంగా దళిత కులానికి చెందినవారే. ఒకప్పుడు నూటికి నూరు శాతం దళితులే పారిశుధ్య కార్మికులుగా పనిచేసేవారు.

కలల రాజధాని

యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ సంస్థ రూపొందించిన సీడ్‌ కాపిటల్‌ నమూనాను 70 ఎంఎం టెలిస్కోప్‌లో చూపించి యావదాంధ్ర ప్రజలకు కనువిందు కలిగించారు. చంద్రబాబు నాయుడు చూపించిన రాజధాని ప్రణాళికలో కలల రాజధానిపై కలలుగనేవారికీ, కలలతో వ్యాపారం చేసుకునేవారికీ కావాల్సిన హంగూ ఆర్భాటాలన్నీ పుష్కలంగా వున్నాయి. 7, 325 చ. కమి. మీ . విస్తీర్ణంలో నిర్మించే మూడంచెల రాజధానిలో 16.9 చ.కి.మీ వైశాల్యంలో మొదట ఈ సీడ్‌ కేపిటల్‌ సిటీని ఏర్పాటు చేయనున్నారు.

కాంగ్రెస్ బండారం బయటపెడతా:సుష్మా

బొగ్గు స్కాంలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమాటిక్ పాస్ పోర్టును ఇప్పించాలంటూ ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత తనపై ఒత్తిడి తెచ్చారని సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని బట్టబయలు చేస్తానని ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ చేసిన విమర్శలపై ఏఐసిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లోనే మాట్లాడుతామని పేర్కొన్నారు

లోక్‌సభ రెండుగంటలకు వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా వాయిదాల పర్వం ప్రారంభమైంది. తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట మృతులకు సభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలు అడ్డుకోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంటపాటు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్‌సభను మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు.   

విద్యా సంస్థలపై RSS డేగ కన్ను

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని రాజకీయ పక్షం బిజెపిని ఎవరైనా విమర్శిస్తే నేరుగా వారికి హిందూ విరోధులనే బిరుదిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించినా, వ్యతిరేకించినా వారిని భారత విరోధులని ముద్ర వేయటం జరుగుతున్నది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి చెందిన ఏ నాయకుడో వెళ్ళగక్కిన విషం కాదు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార పత్రిక ఆర్గనైజర్‌లో అక్షరీకరించబడ్డ సూత్రం.

ప్రజలకు అండగా నిలుస్తాం..

మాస్టర్‌ప్లాను నివేదిక ప్రకారం ప్రసుత్తం గ్రామాలు తరలిస్తామంటున్నారని, రేపు ఉన్న ప్రజలనూ తరలించేస్తారని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు అన్నారు. గ్రామాల్లో రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు నవీన్‌ప్రకాష్‌తో కలిసి పర్యటించారు. ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళనకు దిగడంతో ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు.

సెప్టెంబర్‌ 2న సమ్మె యథాతథం

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల సమస్యలు, కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న సమ్మె ప్రకటించిన ప్రకారం సాగుతుందని సిఐటియు జాతీయ కార్యదర్శి డా|| హేమలత స్పష్టంచేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్మిక సదస్సు మంగళవారం ముగిసింది. ఇందులో సెంటర్‌ ఫర్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌(సిఐటియు) తరపున పాల్గొన్న హేమలత మీడియాతో మాట్లాడుతూ...దేశంలో ఉన్న పదకొండు జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగానే ఉన్నాయని...సమ్మె ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో జాతీయ సమ్మెపై సదస్సులు జరిగాయని గుర్తుచేశారు.

రాజ్యసభలో మళ్లీ రగడ

 రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వీసా వివాదంపై చర్చ జరగాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మెన్ కురియన్ సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభయ్యాక కూడా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత ప్రారంభమైన కొద్ది క్షణాలకే ప్రతిపక్ష సభ్యులు సభలో కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ చైర్మెన్ హమిద్ అన్సారీ అరగంటపాటు వాయిదా వేశారు.

ఎంపిల ఆతిధ్యానికి 24కోట్లు

కేంద్రం 47 మంది ఎంపీల బస నిమిత్తం ఇటీవల రూ.24 కోట్లు చెల్లించింది. బీజేపీ, కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, ఆమ్‌ఆద్మీ తదితర పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరంతా ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో, ప్రభుత్వ అతిథిగృహా ల్లో 14 నెలలుగా ఆతిథ్యం పొందుతున్నారు. సాధారణంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ప్రభుత్వం 30 రోజుల్లోగా ఢిల్లీలో ఫ్లాట్లు కేటాయించాలి. అప్పటివరకు వారి తాత్కాలిక బసకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అయితే, 10 మందికి కేటాయించిన భవనాలు నివాసయోగ్యమే అయినా, వారు వాటిలోకి మారనందువల్ల భారం పడుతోంది.  

హోదా సాధించకపోతేప్రతిఘటనే

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు తిరిగొస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేయించలేని పక్షంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక లెనిన్‌ సెంటర్లో మంగళవారం మాక్‌ పార్లమెంట్‌ను నిర్వహించారు.

Pages

Subscribe to RSS - July