ల్యాండ్ పూలింగ్లో భూములివ్వని నిడమర్రు పొలాల్లో విత్తనాలు వేసి సాగు పనులను సిపిఎం, వైసిపి ఆధ్వర్యంలో ఆదివారం రైతులు ప్రారంభించారు. తొలుత నిడమర్రు గ్రామంలోనుండి పొలాల వరకు వైసిపి, సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రత్నారెడ్డి పొలంలో ట్రాక్టర్తో దున్ని వరి విత్తనాలను చల్లారు. నీరుపెట్టి మట్టిని చదునుచేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు మాట్లాడు తూ జపాన్, సింగపూర్, కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజ నాలు చేకూర్చి లబ్ధిపొందేందుకు టిడిపి ప్రయత్నిస్తుంద న్నారు. దానిలో భాగంగానే వేలాది ఎకరాల సమీకరించిం దన్నారు.