November

నగదు కొరత మరో ఐదు మాసాలు..

 ఇప్పట్లో నగదు కొరత తీరే అవకాశాలు కానరావడం లేదు. మరో ఐదు నెలల వరకు ఇదే దుస్థితి కొనసాగనుందని స్వయంగా బ్యాంకింగ్‌ సంఘాలు పేర్కొంటున్నాయి. వచ్చే నాలుగైదు మాసాలు ఇదే నగదు కొరత ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. దేశంలోని నాలుగు ముద్రణాలయాలు పూర్తి స్థాయిలో పనిచేసినా, ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదన్నారు. వచ్చే నెలలో ఉద్యోగుల వేతనాలకు సమస్యలు ఏర్పడతాయని చెప్పారు

రెండు రకాల 500 నోట్లు చెల్లుతాయి..!

రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానంలో కొత్త రూ.2000, రూ.500 నోట్లను చలామణీలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త నోట్లను యుద్ధప్రాతిపదికన ముద్రించి అన్ని బ్యాంకులకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొత్త రూ. 500 నోటు రెండు వర్షన్లలో ముద్రితమై బయటకు వచ్చేసింది. అది చూసి కొందరు వినియోగదారులు ఏది అసలో, ఏది నకిలీనో అని ఆందోళన చెందుతున్నట్లు వార్తలు రావడంతో బ్యాంకు ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.రెండు రకాల నోట్లూ చెల్లుతాయని ఆందోళన వద్దని తెలిపింది. ఈ రెండు సెట్ల మధ్య ఉన్న తేడాలేంటంటే.. గాంధీజీ చిత్రం నీడ, జాతీయ చిహ్నం చోటు మారడం, రంగులో కొద్దిగా తేడా, బోర్డర్‌ సైజ్‌ తేడా.

మోడీ క్షమాపణ చెప్పాలి..

నల్లధనానికి ప్రతి పక్షాలు మద్దతిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఖండించాయి. మోడీ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. 

కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలి..

ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 4,534 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుకు శుక్రవారం లేఖ రాశారు. జిఒ 142, 143ల ద్వారా 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశారని పేర్కొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్స్‌ నియామకంతో ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయని తెలిపారు

మన్మోహన్ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ధ్వజం

పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ‘వ్యవస్థీకృతమైన, చట్టబద్ధమైన దోపిడీ’గా పేర్కొన్న మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ విమర్శలు చేసింది. ‘మన్మోహన్‌ సింగ్‌ను అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరిగా పరిగణిస్తారు. కానీ యూపీఏ పదేళ్ల హయాంలో ఆయన ఏం చేశారు? కనీవినీ ఎరుగని వరుస కుంభకోణాలు, చూసి చూడని విధానాలతో ఎక్కువ నల్లధనం సృష్టి అప్పుడే జరిగింది. ఇది జాతి సంపదను వ్యవస్థీకృతంగా దోచుకోవడం కాదా అని’ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార్‌ ప్రముఖ్‌ జె.నందకుమార్‌ విమర్శించారు.

ప్రధాని వ్యాఖ్యలపై గరం..గరం

ప్రధానమంత్రి పూర్తిస్థాయిలో సన్నద్ధమవకుండా నోట్లను రద్దు చేశారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను పీఎం నరేంద్రమోడీ తిప్పికొట్టారు. నోట్ల రద్దుపై సిద్ధమయ్యేందుకు తగిన సమయం దొరకలేదనే బాధలో ప్రతిపక్షాలు ఉన్నాయిని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ఉభయసభల్లో గందరగోళం సృష్టించాయి. పీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాలు నల్లధనం కలిగి ఉన్నాయనే విధంగా ప్రధాని వ్యాఖ్యానించారని, ఇది అన్ని పక్షాలను అవమానించడమే నని అభ్యంతరం తెలిపాయి.

మైనార్టీలపై మానసిక యుద్ధం

ఎల్‌కె అద్వానీ 2002లో తన రథయాత్ర ద్వారా కాషాయ శక్తులను పునరేకీక రించి డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును విధ్వంసం చేయించ టం ద్వారా దేశ లౌకికవాదాన్ని అపహాస్యం చేశారు. దాని ఫలితాన్ని వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు అనుభవిస్తుండటం వేరే విషయం అయినప్పటికీ, బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి తప్పించుకోవడం ద్వారా ప్రజా స్వామ్యాన్ని పరిహాసం చేశారు. ఆ క్రమాన్ని గుజరాత్‌లో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లిన మోడీ పరివారం ఇప్పుడు ఉత్త ర ప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా అసలు ప్రజా స్వామ్యం మనుగడనే సహించలేమన్నట్టుగా వ్యవ హరిస్తుండటం అత్యంత విచారకర అంశం.

Pages

Subscribe to RSS - November