టిడిపి ఎమ్మెల్యే రేవంత్రెడ్డి జైలు నుంచి బెయిల్పై బయటకు వస్తూ మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, ఇకపై ఈ మాటలు మానకపోతే సహించేది లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మంత్రులు మహేందర్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి వేరువేరుగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు శిక్షణతో రేవంత్రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి మండిపడ్డారు. మరోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.