ఆర్థికపతనం మరోసారి సంభవించ నుందనే భయం ఆర్థికాభివృద్ధిని పెంపొందిం చాలంటే ప్రభుత్వాలు ద్రవ్య విధానపరమైన చొరవ తీసుకోవాలనే వాదనకు బలం చేకూరు స్తున్నది. కాని ప్రభుత్వాలు అటువంటి చర్యలు తీసుకోవటాన్ని ప్రపంచ ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తన ప్రయోజనాలకు విఘాతం కలగనంత వరకే ప్రభుత్వాలు అప్పులు చేయటాన్ని ద్రవ్య పెట్టుబడి అనుమతిస్తుంది.
భారత్, చైనాల మధ్య అభివృద్ధిలో పోలికలు ఈనాటివి కావు. రెండు దేశాలూ రెండేళ్ల తేడాతో విముక్తి పొందడం, జనాభాలో, ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ పోలికలు నాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వం చైనా భారత కన్నా వెనుకబడి ఉండేది. సోషలిస్టు నిర్మాణం తరువాతా, 1980 దశకంలోనూ చైనా అప్రతిహత అభివృద్ధి సాధించడంతో భారత్ను అధిగమించి ముందుకు పోయింది. గత 20 ఏళ్లకు పైగా రెండంకెల అభివృద్ధితో నడుస్తున్న చైనా వేగం మందగించిందనీ, భారత్ వచ్చే ఏడాది అభివృద్ధిలో దాన్ని అధిగమిస్తుందనీ ఆర్థిక పండితులు, సంస్థలు చెబుతున్నాయి.
త్రిపుర రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో సిపియం రెండూ స్థానాల్లోను విజయం సాధించింది. ఈ రెండు చోట్ల ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. సుర్మ నియోజకవర్గం నుండి అంజన్ దాస్ 15,307 మోజార్టీ సాధించగా,మరో నియోజకవర్గం ప్రతాప్ ఘర్ నుండి రామ్ దాస్ 17,326 మోజార్టీ ఓట్లు సాధించారు.
తిరువనంతపురం: బార్ల లంచాలకు సంబంధించిన కేసులో ఆర్థిక మంత్రి కెఎం మణిని ప్రాసిక్యూట్ చేయరాదన్న విజిలెన్స్ నిర్ణయంపై ప్రతిపక్ష ఎల్డిఎఫ్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని అనుమ తించనందుకు నిరసనగా ఎల్డిఎఫ్ సభ నుండి వాకౌట్చేసింది. ఈ నెల 27న జరిగిన అరువిక్కర ఉపఎన్నిక నేపథ్యంలో రిషెడ్యూల్ అయిన అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావే శాలు సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యా యి. సభ ప్రారంభమైన వెంటనే విజిలెన్స్ విభాగం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాయిదా తీర్మానం కోసం ఎల్డిఎఫ్ స్పీకర్కు నోటీసు అందచేసింది.
మహారాష్ట్ర సంస్థానాలన్నింటా బలవంతంగా ఆమోదింపక తప్పని ఉచ్ఛస్థితిలో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఉన్న రోజులవి. ఛత్రపతి శివాజీ వంశీయులు, ఘాట్గే వంశీయులైన జయంతిసింగ్ అబాసాహెబ్, రాధా బాయిలు సాహూ మహరాజ్ తల్లిదండ్రులు. వీరు క్షత్రియులా? కాదా? అన్న శీలపరీక్షకు గురిచేసింది ఆనాటి బ్రాహ్మణ వర్గం. సాహూ మహరాజ్ 1874 జూన్ 26న జన్మించారు. 1894లో తన ఇరవయ్యవ ఏట పాలనా బాధ్యతలు చేపట్టి ఎన్నో సామాజిక ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. బ్రాహ్మణ మనువాద తాత్వికతను క్షుణ్ణంగా పరిశీలించారు. అవరోధంగా ఉన్న వాటిని వదిలి ప్రజల సానుకూల అంశాలను పాలనా వ్యవస్థలో ఇమిడ్చారు.
''అఖిల భారత ఇమామ్ సంస్థ'' ముఖ్యులు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ 30 మంది అనుచరులతో కేంద్ర సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి ఆధ్వర్యంలో ప్రధాని మోడీని కలిశారు. ఆ సందర్భంలో, ''... మతపరమైన భాషను నేను ఎప్పుడూ ఉపయోగించ లేదు. ... అర్ధరాత్రి కూడా మీ ఆర్తనాదాలు వింటాను'' అన్నారు మోడీ. మోడీయంలో గడిచిన వసంతమొక్కటే. గడవనున్న వత్సరాలలో నేతి బీరకాయ పటాటోప ప్రగల్భ ప్రకటనలెన్నో ప్రారంభం కానున్నాయి. అస్మదీయుల మత దాడులను, పరమత ద్వేష ప్రచారాలను సహించి, మౌనం పాటిస్తున్నందుకు మోడీని అంతర్జాతీయ సమాజం అసహ్యించుకుంటున్నది.
ఓటుకు కోట్ల కేసు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఈ సందర్భంగానూ, అంతకు ముందూ కూడా కేంద్రం నుంచి ఏవో నాటకీయ ఆదేశాలు అందుతాయని, సంచలన పరిణామాలు కలుగుతాయని కథలు చెప్పిన వారికి నిరాశే మిగిలింది. గవర్నర్ పర్యటనకు చాలా రోజుల ముందు నుంచి కేంద్ర హోం శాఖ ఆదేశాల పేరిట చాలా కథనాలు వచ్చాయి. అటార్నీ జనరల్ సలహా పేరిట మరికొన్ని కథనాలు కాలక్షేపం ఇచ్చాయి. అసలు కేంద్రం ఆగ్రహించిన మీదట ఉభయ రాష్ట్రాలూ వివాదాన్ని వెనక్కు పెట్టేశాయని కొందరు మీడియాధిపతులు భాష్యాలు చెప్పారు.
తాకస్థాయికి చేరిన గ్రీస్ రుణ సంక్షోభంతో ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల అనంతరం వివిధ దేశాలకు చెందిన పెట్టుబడి మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ సంక్షోభ పరిస్థితులతో అప్రమత్తమైన ఫ్రాన్స్ తన కరెన్సీ మారకం విలువను తగ్గించి నష్టనివారణ చర్యలు తీసుకోవటంతో ఐరోపా కూటమి దేశాలు అదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే తలెత్తిన ఈ ముప్పును గుర్తించటంలో విఫలమైన యూరోజోన్ దేశాలకూటమి ఇప్పుడు గుర్తించి గ్రీస్పై ఎదురుదాడికి దిగింది. అత్యవసర సాయాన్ని కొనసాగించకూడదని నిర్ణయించిన ఐరోపా సెంట్రల్ బ్యాంక్ గ్రీస్ బ్యాంకులకు అత్యవసర నగదు సరఫరాను నిలిపివేసింది.
ప్రపంచ దేశాలన్నీ అణువిద్యుత్కేంద్రాలను మూసివేసి, ప్రత్యామ్నాయాల వైపు వెళ్తుంటే భారత్లో మాత్రం అణు విద్యుత్కేంద్రాలను ఎందుకు పెడుతున్నారు? భారతదేశంలోని కార్పొరేట్ సంస్థలు, బడా పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి అమెరికా పెట్టిన షరతులను ప్రభుత్వం అంగీకరించింది.