June

నల్ల డబ్బు రూ.30 లక్షల కోట్లు

భారత కుబేరులు విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బు రూ.30 లక్షల కోట్లుగా నూతన అధ్యయనం ద్వారా అంచానా వేశామని యాంబిట్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఇది దేశ జిడిపిలో 20 శాతంగా వున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది. 2016 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపిని 2.3 లక్షల కోట్ల డాలర్లు(రూ.154 లక్షల కోట్లు)గానూ, నల్లడబ్బును 460 బిలియన్‌ డాలర్లు(రూ.30 లక్షల కోట్లు)గానూ క్యాపిటల్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. 

నిన్న ఖతార్.. నేడు స్విట్జర్లాండ్

ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తీరికలేకుండా గడుపుతున్నారు. ఆదివారం ఖతార్లో పలు సమావేశాల్లో పాల్గొని, కీలక ఒప్పందాలు చేసుకున్న మోదీ.. సోమవారం స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. మోదీ ఖతార్ నుంచి ఒక్క రోజు పర్యటన కోసం స్విట్జర్లాండ్ చేరుకున్నారు.

54ఏళ్ల తర్వాత అమెరికా,క్యూబా దౌత్యం

ఐదు దశాబ్దాలకు పైగా వైరం కొనసాగిన తర్వాత అమెరికా, క్యూబాలు మళ్లీ దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్నాయి. 1961 తర్వాత.... తొలిసారిగా వందలాదిమంది సమక్షంలో సోమవారం వాషింగ్టన్‌లోని క్యూబా రాయబార కార్యాలయం వద్ద క్యూబా పతాకాన్ని ఎగురవేయగా క్యూబా రాజధాని హవానాలో అమెరికా పతాకాన్ని లాంఛనంగా ఎగురవేశారు.

మరో స్వాతంత్య్రోద్యమం సాగాలి

నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాలపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్‌ హాలులో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుల కుటుంబ సభ్యుల సమ్మేళనం' జరిగింది.

విజయవాడ ఇఫ్తార్‌ విందుకు సిఎం

రాష్ట్ర ప్రభుత్వ తరుపున ఈనెల 17న విజయవాడలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. అదేరోజు జరిగే 66వ వనమహోత్సవంలోనూ పాల్గొననున్నారు. బృందావన్‌కాలనీలోని ఎకన్వెన్షన్‌ హాల్లో సాయంత్రం ఐదుగంటల తరువాత ఇఫ్తార్‌ విందు ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నారు. సుమారు మూడువేలమంది మంది హాజరవనున్నారు. అలాగే కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలోని జక్కంపూడి గ్రామ పరిధిలో వనమహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి ఫైలాన్‌ ఆవిష్కరించ డంతోపాటు, ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ముఖ్య మంత్రితోపాటు సుమారు 1000 మంది విద్యార్థులు మొక్కలు నాటే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 

"అవినీతి -కార్పొరేట్ రాజకీయాలు - ఫ్రత్యామ్నాయం"

దేశ రాజకీయాలను అవినీతిమయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్‌ సంస్థల అధినేతల కాళ్లు రుద్దే పనిలో నేటి పాలకులు నిమగమయ్యారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. 'అవినీతి -కార్పొరేట్‌ రాజకీయాలు- ప్రత్యామ్నాయం' అనే అంశంపై సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సదస్సు జరిగింది. పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడుతూ రాజకీయాల్లోకి కార్పొరేట్‌ శక్తులు చొరబడిన తరువాత అవినీతికి అడ్డే లేకుండా పోయిందన్నారు. దీనిద్వారా చట్టసభల్లోకి వెళ్లి అక్కడ నుంచి వేల కోట్లు దోచుకోవడమేగాక సభలనూ నియంత్రిస్తున్నారని చెప్పారు.

'సివి సమగ్ర రచనలు - సమాలోచన'

కుల వ్యవస్థపై పోరాటానికి సివి రచనలు ఆయుధంగా ఉపయోపడతాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. విజయవాడలోని వేదిక కళ్యాణ మంటపంలో ఆదివారం సాహితీ, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యాన 'సివి సమగ్ర రచనలు - సమాలోచన' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అధ్యక్షత వహించారు. సమాలోచనలో భాగంగా 'కులం-వర్గం - సివి విశ్లేషణ' అంశంపై జరిగిన సమావేశంలో రాఘవులు మాట్లాడారు. సాంస్కృతిక విప్లవం అవసరమని సివి రచనలు మనకు చెబుతున్నాయన్నారు. సాంస్కృతిక ప్రతీఘాత విప్లవం సృష్టించడానికి బిజెపి, సంఫ్‌ు పరివార్‌లు ప్రయత్నిస్తున్నాయన్నారు.

అవినీతి రొచ్చులో బిజెపి

          'అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న' సామెత బిజెపికి బాగా నప్పుతుంది. పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్‌ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్‌ అవినీతిని తూలనాడి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతిలో ఈత కొడుతున్నది. తొలి వసంత సంబరాలు జరుపుకుంటున్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిజెపికి, ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. మొన్న సుష్మా స్వరాజ్‌, నిన్న వసుంధరా రాజే, నేడు పంకజా ముండే అక్రమాలతో బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ గిలగిల్లాడుతున్నారు.

Pages

Subscribe to RSS - June