June

కేరళలో సోనియాపై FIRనమోదు

 కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై కేరళలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కేరళలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ భవనం నిర్మించిన కాంట్రాక్టర్‌ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సోనియాగాంధీ 2005లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభోత్సవం చేశారు. బకాయిలు చెల్లించాలని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లీగల్‌ నోటీసులు పంపడంతో కేపీసీసీని బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. కానీ చెల్లించకపోవడంతో ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

దళితులు - భూమి - అంబేద్కర్‌

డాక్టర్‌ బిఆర్‌ అంబే ద్కర్‌ ప్రధానంగా ఆర్థిక శాస్త్రవేత.్త 1915లో కొలంబి యా యూనివర్సిటీలో 'ప్రాచీన భారత వాణిజ్యం'పై పరిశోధ నా పత్రాన్ని సమర్పించి ఎంఎ డిగ్రీని పొందారు. ఆయన అత్యంత శ్రమతో పరిశోధించిన 'నేషనల్‌ డివిడెండ్స్‌ ఆఫ్‌ ఇండియా' అనే పరిశోధనా గ్రంథాన్ని 1916 జూన్‌లో పిహెచ్‌డి కోసం కొలంబియా యూనివర్సిటీకి సమర్పించారు. ఈ గ్రంథం 'ది ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రిన్సిపుల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా' అనే పేరు మీద ప్రకటించబడింది. తరువాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్సులో 1916 జూన్‌లో చేరారు.

ముద్రగడ దీక్షకు సంపూర్ణ మద్దతు:VH

ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌ ఇప్పటిది కాదన్నారు. తునిలో విధ్వంసంయ సృష్టించింది అసాంఘిక శక్తులని... కాపులు శాంతి కాములకులని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు కాపులను ఎందుకు అరెస్టు చేయిస్తున్నారని వీహెచ్‌ ప్రశ్నించారు.

హోదాపై జవాబివ్వని స్మృతి..

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజయవాడ విద్యార్థులు రాజ కీయ కోణంలో ప్రశ్నలు సంధించి ఝలక్‌ ఇచ్చారు. ఆమె విజయవాడ కెబిఎన్‌ కళాశాల విద్యార్థులతో మంగళవారం ఏర్పాటైన ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులు, వర్సిటీల్లో రాజకీయాలు తదితర అంశాలపై విద్యార్థులు పలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై వెనకడుగు ఎందుకని శ్రీదుర్గ అనే ఎంసీఏ విద్యార్థిని మంత్రిని ప్రశ్నించారు. అది తన పరిధిలోని విషయం కాదని మంత్రి జవాబు దాట వేశారు. 

మోదీ గొప్పలు హాస్యాస్పదం:సురవరం

 రెండేళ్లలో అవినీతి రహిత పాలన అందించామని ప్రధానమంత్రి మోదీ గొప్పలు చెప్పుకోవడం హ్యాస్యాస్పదంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యాలు దేశం నుంచి పారిపోయారని... వారిని వెనక్కి రప్పించడంతో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజె, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లపై అవినీతి ఆరోపణలు వస్తే భాజపా ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు.

హోదా బాబుకే..రాష్ట్రానికి రాలేదు:BVR

రాష్ట్ర విభజనతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు హోదా వచ్చిందే తప్ప.. రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా రాలేదని, పైగా తన కొడుక్కీ మంత్రిగా హోదా ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. 

హోదా బాబుకే..రాష్ట్రానికి రాలేదు

సిపిఎం రాష్ట్ర కమిటీ మూడు రోజుల సమావేశాలు మంగళవారం భీమవరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధాన్యానికి ధర లేదు, పామాయిల్‌కు ధర లేదు.. ప్రజలు కొనే వస్తువుల ధరలు మాత్రం మండిపోతున్నాయని విమర్శించారు. కౌలురైతులకు రక్షణగా పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్లే రిజర్వేషన్లపై ఉద్యమాలు వస్తున్నాయన్నారు. తుందుర్రు ఫుడ్‌పార్క్‌ నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోందని, అదే జరిగితే పెద్దఎత్తున పోరాటం తథ్యమని అన్నారు. 

కార్పోరేట్‌ వైద్యానికి ప్రజలను బలిపశువులుగా మారుస్తున్న ప్రభుత్వాలు

అందరికీ ఆరోగ్యం అన్న నినాదం విశ్వసార్వ జనీతకు అద్దంపడుతున్నప్పటికీ మన దేశంలో ప్రజారోగ్యం జాతీయ ఆరోగ్య విధానప్రకటనకు విరుద్దంగా ప్రవేటీకరణ దిశగాపయనించడం ఆందోళన కలిగిస్తున్నది. దేశ ప్రజల్లో మధ్య తరగతి, పేద ప్రజలు 85శాతం మందిదాకా వున్నారు. పేద ప్రజల ప్రధాన ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండటం వల్ల ప్రభుత్వరంగంలో నిర్వహించబడుతున్న ఆసుపత్రులకు కార్పెరేట్‌ వైద్యం పెను సవాలుగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యతగా, ప్రాథమిక విధిగా పరిగణించవలసివుందని భారత రాజ్యంగంలోని నాలుగవ భాగం ఉద్ఘాటిస్తుంది.

అణువిద్యుత్ కి వ్యతిరేకంగా ఆందోళన

నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు ముందు గుజరాత్ లోని మితివిర్ధిలో నిర్మించి వలసిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడకు తరలిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించడాన్ని సిపియం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విశాఖ సిపియం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  సిహెచ్.నరసింగరావు తెలిపారు .

సబ్‌ప్లాన్‌ అమలు బాధ్యత మాకొద్దు

షెడ్యూల్‌ తరగతుల ఉప ప్రణాళిక (ఎస్‌సిఎస్‌పి) అమలు, పర్యవేక్షణ, సమీక్ష బాధ్యతలను నీతి అయోగ్‌ నుండి తమకు బదిలీ చేయడం సరికాదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమకు సిబ్బంది కొరతే ఇందుకు కారణమని తెలిపింది. 12వ పంచవర్ష ప్రణాళికకు ఇంకా ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఆ తర్వాత ప్రణాళికా వ్యవస్థ వుంటుందా లేదా అనే విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని సామాజిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

Pages

Subscribe to RSS - June