March

సీమ సమస్యలపై చలో అసెంబ్లీ..

 రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నగరంలో వామపక్షాల కార్యకర్తలు కదంతొక్కారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. వామపక్షాల నేతృత్వంలో 15 రోజుల పాటు సీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బస్సుయాత్ర సాగింది. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ-సాగునీటి ప్రాజెక్టులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి.. డిమాండ్లతో వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.

కన్నయ్యకు మాజీ సైనికోద్యోగి లీగల్‌ నోటీసు..

జెఎన్‌యు విద్యార్థ్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌కు మాజీ సైనికోద్యోగి ఒకరు లీగల్‌ నోటీసు పంపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున భద్రతా బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ కన్నయ్యకు ఈ నోటీసులు వచ్చాయి. మండి జిల్లాలో రిటైర్డ్‌ సుబేదార్‌ కెహన్‌ సింగ్‌ థాకూర్‌ ఈ నోటీసులు పంపారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా తమ వాణిని వినిపిస్తామంటూనే సైనికుల పట్ల తమకు గౌరవం వుందని అయితే కాశ్మీర్‌లో మహిళలపై భద్రతా బలగాలు అత్యాచారాలకు పాల్పడిన వాస్తవంపై తాము మాట్లాడతామని కన్నయ్య వ్యాఖ్యానించారు. 

శారద స్కాంపై BJP మౌనం ఎందుకు?

శారద చిట్‌ ఫండ్‌ స్కాంపై వాస్తవాలు వెలువడినప్పటికి బిజెపి ఎందుకు మౌనం దాల్చిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ పక్షనేత సీతారామ్‌ ఏచూరి ప్రశ్నించారు. రాజ్యసభలో ఈ అంశంపై చర్చల్లో బిజెపి నోరు మెదపలేదని దుయ్యబట్టారు. మంగళవారం పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏచూరి మాట్లాడారు. భారత దేశ రాజకీయ చరిత్రల్లో ఇంత వరకు ఇలా జరగలేదని, ఒకే కుంభకోణంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, మేయర్లు భాగస్వామ్యం ఉందని ద్వజమెత్తారు. శారద చిట్‌ ఫండ్‌ కుంభకోణంలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని, ఈ అంశంలో టిఎంసి, బిజెపి మిలాఖత్‌ అయినట్లు తెటతెల్లం అయ్యిందని దుయ్యబట్టారు.

ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వాడివేడి చర్చ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్‌ సభ్యులు ఉభయ సభల్లో చేసిన డిమాండ్లతో మంగళవారం పార్లమెంటులో వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా రాజ్యసభలో వాడివేడి చర్చ చోటు చేసుకొంది. విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ సభ్యులంతా ప్రభుత్వ తీరుపై గళమెత్తారు. చర్చలో సి.ఎం.రమేశ్‌ (తెదేపా) పాల్గొంటూ- కాంగ్రెస్‌ పార్టీ హడావుడిగా, అశాస్త్రీయంగా విభజన చట్టాన్ని రూపొందించిందని ఆరోపించారు. తెదేపా మొదటి నుంచీ పోరాడుతున్న అంశంపై ఎట్టకేలకు కాంగ్రెస్‌ నేతల్లో అవగాహన వచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా కల్పించడంలో పురోగతి ఏమిటో తెలపాల్సిందిగా ఆజాద్‌ నిలదీశారు.

మమతా సర్కార్‌ ఉక్కిరిబిక్కిరి..

బెంగాల్‌లో స్టింగ్‌ ఆపరేషన్‌ మమతా సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్లు వెల్లడించే ఓ వీడియో పశ్చిమబెంగాల్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీఎంసీ ఎంపీలు సౌగత్‌రాయ్‌, అహ్మద్‌ మిజ్రా, బెంగాల్ మంత్రి సుబ్రతముఖర్జీ , కోల్‌కతా మేయర్‌ శోవన్‌ ఛటర్జీ ఓ లాబీకి హామీలిస్తూ లంచాలు తీసుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపించారు. నారదన్యూస్‌.కామ్‌ అనే వెబ్‌ ఛానల్‌ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ ను నిర్వహించింది.

భూముల రక్షణకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

           భూములను రక్షించుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ సేకరణపై ప్రభుత్వం ముందడుగు వేస్తే రైతులకు అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆర్‌టిసి కాంపెక్స్‌ వద్ద సోమవారం భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పిసిపిఐఆర్‌ కోసం ప్రభుత్వం వంద పంచాయతీల్లో లక్షా 30 వేల ఎకరాల భూమిని రైతుల వద్ద బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.

ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం ఫై ఇంజినీరింగ్‌ నిపుణుల బృందంచే విచారణ జరిపించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణం కింద విశాఖనగరంలో పెందుర్తి ప్రాంతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం చేపట్టింది. ఈరోజు సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి శ్రీ బి.గంగారావు నాయకత్వంలో  బృందం   పెందుర్తిలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది.  ఈ నిర్మాణా యొక్క భద్రత, ప్రమాణాలు , నాణ్యత, దాని కాలవ్యవధి తదితర అంశాపై అనేక అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి.

రైల్వే జోన్‌ పై ఎంపి కె. హరిబాబు ప్రకటనపై సిపిఐ(ఎం) నిరసన

     విశాఖ నగర ఎంపి కె.హరిబాబుగారు నిన్న రైల్వేజోన్‌పై ప్రకటించిన కుట్రపూరిత ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావటానికి చాలా అడ్డంకులు,సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ(ఎం) గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఈరోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేసింది.

Pages

Subscribe to RSS - March