March

ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఆందోళన

ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఈ నెల 22న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహించనున్నారు.గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తామని చెప్పిన టిడిపి ప్రభుత్వం, 21 మాసాలు గడిచినా ఆ హామీని అమలు చేయలేదని వారు విమర్శించారు. 21 మాసాలలో పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం గానీ, స్థలాల కేటాయింపుగానీ జరగలేదని పేర్కొన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉండగా, పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నవారు కూడా ఉన్నారన్నారు.

పీర్‌లెస్‌ రక్షణ ప్రభుత్వ బాధ్యత..

దేశంలోని చిన్న మొత్తాల పొదుపు సంస్థలలో ప్రముఖ స్థానంలో ఉండి ఆర్‌బిఐ నిబంధనలకనుగుణంగా నడుస్తూ ప్రజాభిమా నాన్ని చూరగొన్న సంస్థ పీర్‌లెస్‌ జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ లిమి టెడ్‌. నిజాయితీగా తన ఖాతాదారులకు మెచ్యూరిటీ సొమ్మును అందిస్తున్న ఈ సంస్థ ఆర్‌బిఐ విధించిన ఆంక్షల ఫలితంగా తన వ్యాపారాన్ని 2011 ఏప్రిల్‌ 1 నుంచి ఆపేయాల్సి వచ్చింది. దీనితో పీర్‌లెస్‌ సంస్థ ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ఖాతాదారులు తిరిగి తమ డబ్బును పీర్‌లెస్‌ సంస్థలో పొదుపు చేసుకొనే అవకాశం కోల్పో యారు.

కులం కోసం కాదు.. కూటి కోసం

ప్రస్తుతం దేశంలో కుల, మతాల జాడ్యం పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ప్రజలు కులం కోసం కాకుండా, కూటి కోసం పోరాడాలని ప్రముఖ విప్లవ సినీ గేయ రచయిత వంగపండు ప్రసాద్‌ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడు పినిపే సత్యనారాయణ రాసిన 'ధిక్కార ఖడ్గం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.అంబేద్కర్‌ మనల్ని కులం కంటే కూటి కోసమే పోరాడాలని చెప్పారన్నారు. డబ్బుకు ప్రాణం లేకపోయినా అన్నింటినీ శాసిస్తుందన్నారు. 

మాల్య , మోడీ లను అరెస్ట్ చేయండి:కాంగ్

ప్రభుత్వ రంగ బ్యాంకులకు శఠగోపం పెట్టిన విజయ్ మాల్యాపై రాజ్యసభలో సోమవారం రభస జరిగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలోనే విజయ్ మాల్యా భారీగా బ్యాంకు రుణాలు పొందారన్నారు. గత దశాబ్దంలో విపరీతంగా రుణాలు విజయ్ మాల్యాకు ఎలా లభించాయో కాంగ్రెస్ చెప్పాల్సి ఉందన్నారు.కాంగ్రెస్ స్పందిస్తూ ‘‘మీరు రుణం ఇవ్వండి... నన్ను ఒంటరిగా వదిలేయండి’’ అనే వైఖరిని మాల్యా అనుసరిస్తున్నారని, అందుకే మీడియాతో సహా అందరిపైనా దాడి చేస్తున్నారని విమర్శించింది.

జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై ఏబీవీపీ కేసులు..

జేఎన్‌యూ అడ్మినిసే్ట్రషన్‌పై చట్టపరమైన చర్యలకు అఖిల భారత విద్యార్థి పరిషత (ఏబీవీపీ) సన్నద్ధమైంది. అఫ్జల్‌ గురుపై ఫిబ్రవరి 9న నిర్వహించిన కార్యక్రమానికి అనుమతిచ్చినందుకు జేఎన్‌యూ అసోసియేట్‌ డీన్‌ పైన, భారత చట్టవిరుద్ధంగా కాశ్మీర్‌ను ఆక్రమించుకుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ప్రొఫెసర్‌ నివేదితా మీనన్‌ పైనా ఏబీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బిల్లులపై బిజెపి మల్ల గుల్లాలు..

పార్లమెంటు తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు మరో మూడు పనిదినాల్లో ముగియనున్న నేపథ్యంలో కీలక బిల్లులకు ఆమోదంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజావేగుల రక్షణ(సవరణ) బిల్లు-2015, కాందిశీకుల ఆస్తుల(సవరణ, ఆమోదం) బిల్లు-2016వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే లోక్‌సభ ఆమోదించిన ఆధార్‌ బిల్లుకు రాజ్యసభలో, ఎగువసభ ఆమోదముద్ర వేసిన రియల్‌ ఎస్టేట్‌ బిల్లుకు లోక్‌సభలో అంగీకారం పొందాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని చర్చనీయాంశాలు దిగువసభలో ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్‌ 20 నుంచి పార్లమెంటు రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

RSS వాళ్ళు ప్యాంట్లు వేసుకున్నంత మాత్రాన..

నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు వేసుకున్నంత మాత్రాన స్వయం సేవక భావజాలం కగిన వ్యక్తులకు ఆధునిక భావజాలం ఒంటబట్టదని ఆర్ఎస్ఎస్‌పై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంగ్య విమర్శలు చేశారు. ఫుల్‌ ప్యాంట్లు వేసుకున్నంత మాత్రానా ఆధునికులు కాలేరని, ఆలోచన ధోరణిలో మార్పు రావాలని లాలూ అన్నారు. కేవలం హిందూ వాదం ఒక్కటే ఆధునికత కాదని ఆర్జేడీ చీఫ్ చెప్పారు.

బెంగాల్లో తృణమూల్‌కి వ్యతిరేకంగా మావోలు..

‘జంగల్‌ మహల్‌’ ప్రాంతంలో తిరిగి పట్టు సాధించడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహస్య ప్రచారం నిర్వహించాలని నిషేధిత సీపీఐ(మావోయిస్టు) భావిస్తోంది. జంగల్‌ మహల్‌గా పిలిచే పురులియా, బంకెరా, పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాల్లో సుమారు 40 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 30 స్థానాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది.

బడ్జెట్‌ సమావేశాలల్లో తేలనున్నGST..

జాతీయ వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), బాంక్రప్టసి అండ్‌ ఇన్‌సాల్వెన్సీ బిల్లు రెండవ దశ బడ్జెట్‌ సమావేశాలలో ఆమోదం పొందుతాయనే ఆశాభావన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. ఈ సమావేశాలు ఏప్రిల్‌ 20న ప్రారంభం కానున్నాయి. జిఎస్‌టి బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొందేందుకు సిద్ధంగా ఉన్నది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తరువాత అక్టోబరు 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ జరిగిన అడ్వాన్సింగ్‌ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ పై విషయాలు తెలిపారు.

33.83 లక్షల కోట్లపై DRI దర్యాప్తు..

UPA ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2004-13 మధ్య దేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన 505 బిలియన్‌ డాలర్ల (ప్రస్తుత విలువలో సుమారు రూ.33.83 లక్షల కోట్లు) డబ్బుపై రెవెన్యూ నిఘా విభాగ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) దర్యాప్తు ప్రారంభించింది. నల్లధనంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇచ్చిన ఆదేశాలతో డీఆర్‌ఐ రంగంలో దిగింది.

Pages

Subscribe to RSS - March