March

'ఉపాధి' పనులు తక్షణమే ప్రారంభించాలి.

జిల్లాలోని పేదలు కూలి పనుల నిమిత్తం వలసలు పోతున్నారని, వాటిని అరికట్టేందుకు తక్షణమే ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కరువు విలయతాండం చేస్తుందని, ఈ పరిస్ధితుల్లో కూలి పనులు లేకపోవడంతో వేలాది మంది ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిధుల్లో 50శాతం సిసి రోడ్లకు ఖర్చు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో చేపట్టే పనుల్లో యంత్రాలు ఉపయోగించ రాదనే నిబంధన ఉందని, కాని ఈ నిధులు సిసి రోడ్లకు ఖర్చు చేయడం నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు.

విశాఖ రైల్వేజోన్‌ సంగతేంటి?

చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన విశాఖ రైల్వే జోన్‌ను ఏంచేశారని, ప్రస్తుతం దాని స్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి సురేష్ ప్రభును ప్రశ్నించారు.

బిజెపి బరిలో బోస్ మనవడు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీతో బీజేపీ అభ్యర్థిగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ మనవడైన చంద్రకుమార్ బోస్ తలపడనున్నారు. మమతపై తమ అభ్యర్థిగా 55 ఏళ్ల చంద్రకుమార్ పోటీ చేస్తారని కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో చెప్పారు.

JNUలో రాందేవ్‌బాబా పాఠాలు..

జేఎన్‌యూ క్యాంపస్‌లో భారీ యోగా శిబిరం నిర్వహించాలని బాబా రాందేవ్‌ యోచిస్తున్నారు. అయితే దీనికి సంబందించి తేదీలు ఇంకా ఖరారు కాలేదన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో వేదాంత, ఆయుర్వేద అంశాలపై యూనివర్సిటీలో జరిగే ఓ విద్యా సదస్సులో బాబా రాందేవ్‌ ప్రసంగిస్తారనే ప్రచారం సాగింది. దీనిపై అథ్యాపకుల్లో ఒక వర్గం నుంచి జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ సదస్సుకు రాందేవ్‌ బాబా హాజరు కాలేదు.

ఇష్రాత్ కేసులో కీలక డాక్యుమెంట్..

ఇష్రాత్ జహాన్ కేసులో కీలకమైన డాక్యుమెంట్ గల్లంతైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్ లో చేసిన మార్పుల కు సంబంధించిన డ్రాఫ్ట్ నోట్ గల్లంతైంది.యూపీఏ హయాంలో పి.చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అఫడవిట్ లో చేసిన మార్పులకు సంబంధించిన డ్రాఫ్ట్ నోట్ హోంమంత్రిత్వ శాఖలో గల్లంతైంది. 

Pages

Subscribe to RSS - March