తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడం ద్వారా ప్రముఖ రచయితలు నయనతార సెహగల్, అశోక్ వాజ్పేయి ప్రధాని మోడీ విస్మరించిన రెండు విధులను, బాధ్యతలను గుర్తు చేశారు. ఈ దేశంలో ఒక పౌరునికున్న జీవించే హక్కును పరిరక్షించడం, సృజనాత్మకతకు సంబంధించి కళాకారునికి గల హక్కును పరిరక్షించడం. దేశంలో ఇంత జరుగుతున్నా తమ సహ రచయితలు, సాహిత్య సంస్థలు మౌనం పాటించడం పట్ల కూడా వారు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రత్యేకించి ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని మాత్రమే సంస్కరించాలని రచయిత భావించరాదు. అవసరమైతే నాగరికతా స్ఫూర్తికి సంబంధించి హెచ్చరికల సంకేతాలు కూడా పంపించాలి.